NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Murder Case: సీబీఐ విచారణకు సహకరిస్తా .. కానీ

YS Viveka Murder Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా ( వివేకానంద రెడ్డి) హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా దర్యాప్తు మందకొడిగా సాగుతుండగా, ఈ కేసు తెలంగాణకు బదిలీ అయిన తర్వాత సీబీఐ దూకుడు పెంచింది. చాలా రోజుల తర్వాత సీబీఐ అధికారులు నిన్న పులివెందుల చేరుకున్నారు. పార్టీ కార్యాలయం వద్ద, ఇంటి వద్ద వైఎస్ భాస్కరరెడ్డి కోసం సీబీఐ అధికారులు వాకబు చేశారు. ఇదే క్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.

MP Avinash Reddy

 

సీబీఐ అధికారుల ఆదేశాల మేరకు ఇవేళ (మంగళవారం) 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం అవినాష్ రెడ్డి హజరు కావాల్సి ఉంది. అయితే ఈ అంశంపై అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు లేఖ రాశారు. సీబీఐ విచారణకు పూర్తి గా సహకరిస్తానని పేర్కొన్న అవినాష్ రెడ్డి.. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల మంగళవారం విచారణకు హజరు కాలేనని చెప్పారు. అయిదు రోజుల వరకూ విచారణకు హజరుకాలేనని పేర్కొన్నారు. అయిదు రోజుల తర్వాత ఎప్పుడు విచారణకు పిలిచినా హజరు అవుతానని తెలిపారు. అవినాష్ రెడ్డి విజ్ఞప్తిని సీబీఐ అధికారులు సమ్మతిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వినతి మేరకు విచారణ తేదీలను మార్పు చేసిన అధికారులు.. అవినాష్ రెడ్డి విషయంలోనూ సమయం ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధి (ఎంపి) కావడంతో సీబీఐ అధికారులు ఆయన విజ్ఞప్తిని కన్సిడర్ చేస్తారని భావిస్తున్నారు.

YS Vivekananda Reddy Murder Case

 

సార్వత్రిక ఎన్నికలకు ముందు 2019 మార్చి 15న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఆయన నివాసంలోనే దారుణ హత్యకు గురైయ్యారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను సీబీఐ అరెస్టు చేసింది. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా భావిస్తున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ విచారణ జరుపుతున్నా వివేకా హత్య కేసులో పురోగతి లేకపోవడం, హత్య కేసులో సూత్రధారులను అరెస్టు చేయకపోవడంతో ఆయన కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత పలు మార్లు సీబీఐ అధికారులను కలవడం, మీడియా ముందు మాట్లాడటం కూడా జరిగింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ కేసు తెలంగాణ రాష్ట్రానికి బదిలీ అయిన తర్వాత ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఏపిలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?