వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఈనాడ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దృతరాష్ట్రుడిలా కళ్ళు మూసుకోకుండా నిజాలు తెలుసుకుని ఆయన మీడియాలో వార్తలు రాయాలని శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు.
ఆయన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఒకలా, ఏపీకి వచ్చేసరికి మరొకలా వార్తలు రాస్తున్నారని, పక్షపాత ధోరణి చూపిస్తున్నారని తెలిపారు. కరోనా సమయంలో ఈ ఆరు నెలల్లో దాదాపు రూ.28,122 కోట్లు ప్రజల శ్రేయస్సు కోసం ఖర్చు చేశామని, కులం, మతం అన్న బేధం లేకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమాలను పట్టించుకోకుండా ఈనాడులో కథనాలు వస్తున్నాయని శ్రీకాంత్ రెడ్డి పై విధంగా స్పందించారు.