ఏపీ రాజకీయాలలో గుంటూరు జిల్లా మొదటి నుండి టీడీపీకి కంచుకోట అని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అమరావతి రాజధాని ని ఏర్పాటు చేయటంతో గుంటూరు జిల్లా లో టిడిపి హవా కి తిరుగే లేదు అన్నట్టు మారింది. కానీ పాదయాత్ర ఇవాల్టికి అలాగే టిడిపి ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకత ప్రజలలో రావటంతో… గుంటూరులో రెండు అసెంబ్లీ స్థానాలు ఒక ఎంపీ మినహా పెద్దగా సీట్లు కొల్లగొట్ట లేకపోయింది.
ఇలా ఉంటే జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు ప్రకటించాక… మళ్లీ టిడిపి గ్రాఫ్ అమాంతం పెరిగినట్లు టిడిపి లెక్కలు వేస్తోంది. జగన్ రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో ఈ ప్రాంత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని దీంతో తమ వైపు మొగ్గుచూపుతున్నారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. పరిస్థితులు ఇలా ఉండగా గుంటూరులో టీడీపీ దుకాణం మొత్తం సర్దించే రీతిలో వైసీపీ తాజాగా సరికొత్త ఎత్తుగడ వేసినట్టు ఏపీ రాజకీయాల్లో టాక్.
మేటర్ ఏమిటంటే గుంటూరు జిల్లాలో ఉన్న పలనాడు ప్రాంతాన్నీ ఒక జిల్లాగా ఏర్పాటు చేసే అలోచనలో వైసీపీ ఉందట. అంతే కాకుండా పల్నాడు జిల్లాగా ఏర్పడితే పరిధిలోకి నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాల నీ తీసుకొచ్చే యోచనలో వైసిపి ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా జిల్లా కేంద్రంగా నరసరావుపేట ను ఏర్పాటు చేయటానికి వైసిపి రెడీ అయిందట. ఏదో గుంటూరు ప్రాంతంలో పల్నాడు అభివృద్ధి జరగాలని ఎప్పటినుండో ప్రజలు కోరుకుంటున్న తరుణంలో ఒక పక్క నరసరావుపేట ఆల్రెడీ అభివృద్ధి చెందటంతో… వైసిపి తాజాగా తీసుకోబోతున్న ఈ నిర్ణయానికి గుంటూరులో టీడీపీ ఇంకా ఖాళీ అయినట్లు అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అదే రీతిలో గుంటూరు జిల్లాలో వైసీపీ దూకుడు పెరగడం గ్యారంటీ అని పరిశీలకులు భావిస్తున్నారు.