న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుకు వైసిపి మద్దతు తెలిపింది. ఈ అంశంపై రాజ్యసభలో మాట్లాడిన ఆ పార్టీ ఎంపి వి విజయసాయిరెడ్డి జమ్ము కశ్మీర్పై కేంద్రం తెచ్చిన బిల్లు సాహసోపేతమైనదిగా అభివర్ణించారు. కశ్మీర్ సమస్యకు ఇది మంచి పరిష్కారమనీ, అన్నిరాష్ట్రాల మాదిరిగానే జమ్ము కశ్మీర్ కూడా అభివృద్ధి చెందుతాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
ఆర్టికల్ 370రద్దుతో భారత సార్వభౌమత్వం మరింత బలోపేతం అవుతుందనీ, వివక్ష అంతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోది, హోంమంత్రి అమిత్షా చరిత్రలో నిలిచిపోతారని విజయసాయిరెడ్డి కొనియాడారు.
ఆర్టికల్ 370రద్దుకు వైసిపితో పాటు టిడిపి,సమాజ్వాది పార్టీ, బిఎస్పి, బిజెడి, అన్నా డిఎంకె, ఆప్ మద్దతు తెలిపాయి. కేంద్ర తీర్మానాన్ని కాంగ్రెస్, జెడియు, ఎండిఎంకె, డిఎంకె, పిడిపి, ఎన్సిపి వ్యతిరేకించాయి.