జగన్ అధికారంలోకి రావటం చంద్రబాబుకి ఆ పార్టీ నేతలకి ఎంత ఇష్టం లేదో అదే స్థాయిలో ఎల్లో మీడియా కి కూడా ఇష్టం లేదు. దీంతో జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నుండి ఆయన ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ప్రజా వ్యతిరేకత కథనాలు ప్రసారం చేయటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. ఇసుక విషయంలో గానీ ఇంగ్లీష్ మీడియం విషయంలో గానీ ఇంకా మరి కొన్ని విషయాల్లో వైయస్ జగన్ కి వ్యతిరేకంగా వరుస కథనాలు ప్రసారం చేస్తూ ఏదో విధంగా ప్రజల్లో వ్యతిరేకత పుట్టించాలని తెగ తాపత్రయ పడుతూనే ఉన్నారు. ఇటీవల జగన్ పరిపాలన ఏడాది అయినా గాని ఏడాదిలో జగన్ ఫెయిల్యూర్ కార్యక్రమాలు అంటూ వారం రోజుల పాటు ఎల్లో మీడియా వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ విధంగా జగన్ నీ కించపరుస్తూ చంద్రబాబుకి హెల్ప్ చేద్దామనుకుని మళ్ళీ బూస్టింగ్ ఇవ్వాలని స్కెచ్ వేసి ఎల్లో మీడియా చేసి చేస్తున్న అత్యుత్సాహం, ఇప్పుడూ చంద్రబాబు మెడకు చుట్టుకున్నే విధంగా ఇరికించినట్లు అయ్యిందని సమాచారం.
క్లియర్ కట్ మేటర్ లోకి వెళ్తే సంక్షేమ కార్యక్రమాలు సొంతంగా జగన్ ఆలోచనల్లో వచ్చిన గాని…. మిగిలిన ప్రభుత్వపరంగా చేయాల్సిన కార్యక్రమాలు చంద్రబాబు ప్రభుత్వానికి కొనసాగింపుగానే భావించాలి. కాగా ఇందులో అవినీతి జరిగిందని…అందులో అవినీతి జరిగిందనే విషయాలను తవ్వి తీస్తే.. బాబు, ఆయన పరివారమే అడ్డంగా బుక్కయ్యే ఛాన్స్ ఉందని చివరి నిముషంలో ఇటీవల ఎల్లో మీడియా గుర్తించినట్లు ఉంది. దీంతో జగన్… చంద్రబాబు ప్రభుత్వానికి కొనసాగింపుగా చేపట్టే కార్యక్రమాల విషయాలను టచ్ చేయకుండా ఎల్లోమీడియా ఉండాలని తాజాగా డిసైడ్ అయిందట.
కారణం చూస్తే అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టిన ఓ కార్యక్రమం విషయంలో జగన్ ప్రభుత్వం ఇటీవల ఇన్ వాల్వ్ అయిన సమయంలో అవినీతి జరిగినట్లు ఎల్లో మీడియా చానల్స్ కథనాలు వరుసగా వడ్డీ వారించయట. అయితే అసలు ఈ కార్యక్రమంలో భూముల కేటాయింపు విషయంలో చంద్రబాబు హయాంలోనే తప్పు జరిగినట్లు తేలిందట. దీంతో ఈ విషయం జగన్ దృష్టికి వెళ్లడంతో… ఈ వివాదంపై ఎంక్వయిరీ చేయాలని జగన్ డిసైడ్ అవుతున్నట్లు టాక్ నడుస్తుంది. దీంతో ఎల్లో మీడియా ఛానల్స్ చంద్రబాబు కి హెల్ప్ చేద్దామని భావిస్తే, ఆయన ని ఇరికించినట్లు అయ్యిందని ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.