Covid -19: దేశ వ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఏడాది క్రితం ఏ విధంగా అయితే కరోనా కేసులు పెరిగాయో ఇప్పుడూ అదే మాదిరిగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో లక్షా 84వేల కొత్త కేసులు నమోదు అయ్యాయి. జాగ్రత్తలు పాటిస్తున్న ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, సెలబ్రెటీలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది.
తాజాగా యుపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ దాస్ కరోనా బారిన పడ్డారు. సీఎంఓ కార్యాలయంలో పలువురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో సీఎం యోగి ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వర్చువల్ గా విధానంగా ఆయన పనులను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం యోగి ఆదిత్యనాథ్ కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సీఎం యోగి ఈ నెల మొదటి వారంలో కరోనా టీకా మోదటి డోసు తీసుకున్నారు. అయినప్పటికీ కరోనా బారిన పడ్డారు.
యుపిలోనూ 20వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత నెలలోనే ఉత్తరాఖండ్ సీఎం తీర్థథ్ సింగ్ రావత్ కూడా కరోనా బారిన పడ్డారు. వెంటనే ఐసోలేషన్ వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకున్నారు.