దేశంలో లవ్ జిహాదీ పేరిట మతాంతర వివాహాల ముసుగులో చోటుచేసుకుంటున్న సంఘటనలకు ఉత్తరప్రదేశ్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. 44 సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1976 సంవత్సరంలో మతాంతర వివాహాలను ప్రోత్సహించే ఓ చట్టం వచ్చింది. దీంతో ఆ చట్టాన్ని అడ్డంపెట్టుకుని లవ్ జిహాద్ పేరిట ఇతర మతాలకు చెందిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు.
అయితే తాజాగా యోగి ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసింది. ఉద్దేశపూర్వకంగా కొంతమంది మతమార్పిడులకు ఈ చట్టాన్ని అడ్డంపెట్టుకుని వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకున్నట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది. అప్పటి చట్టప్రకారం వేర్వేరు మతాలకు చెందిన వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే రెండేళ్లలోపు జిల్లా మెజిస్ట్రేట్ కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
సదరు దరఖాస్తులను ఆమోదం పొందితే ఆ జంట చట్టప్రకారం ప్రభుత్వం తరఫున 50000 ప్రోత్సాహంగా అందుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా గత ఏడాది 11 జంటలు దరఖాస్తు చేసుకుని ఒకటయ్యాయి. అయితే ఇంతలోనే యోగి ప్రభుత్వం ఈ చట్టంపై దృష్టిపెట్టి జరుగుతున్న అవకతవకలను గుర్తించి మతాంతర వివాహాల ముసుగులో మత మార్పిడి జరుగుతుందని ఆరోపణలతో ఉత్తరప్రదేశ్లో ఈ చట్టాన్ని రద్దు చేసింది. యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇతర రాష్ట్రాలు కూడా మతాంతర వివాహాలను రద్దు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.