బాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ మృతి కేసు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి డ్రగ్స్ వ్యవహారంగా మారుతుంది. రియా బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెల్లడించడంతో 25 మంది ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ 25 మంది ఎవరన్నది పూర్తిగా లిస్ట్ బయటకు రానప్పటికి ప్రముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ద కపూర్, సారా అలీఖాన్, దీపిక పదుకొణె హైలెట్ అయ్యారు. ఇప్పటికే వీరిని ఎన్సీబి అధికారులు విచారించారు కూడా.
అయితే ఇప్పుడు తాజాగా రకుల్ కోర్టుకు సబ్మిట్ చేసిన స్టేట్మెంట్ లో రకుల్ నేను నాన్ స్మోకర్ ను అని అలాగే నేను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని పేర్కొంది. ఇప్పటికే ఆమెపై విచారణ కూడా జరిగిన సంగతి తెలిసిందే. వీటి మూలాన ఇప్పటికే ఈమె నటిస్తున్న ప్రాజెక్టులు బ్రేక్ పడ్డాయి. మరి రకుల్ ఎప్పుడు ఈ వ్యవహారం నుంచి బయట పడుతుందో తెలీదు గాని.. రకుల్ కోర్టుకు సబ్మిట్ చేసిన స్టేట్మెంట్ తో ఒక్కొక్కరికి బుర్ర తిరిగి ఉంటుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.
అంతేకాదు ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో రకుల్ పేరు వినిపిస్తున్నప్పటికి చాలామంది నమ్మడం లేదు. రకుల్ ఇలాంటి వ్యవహారంలో అనవసరంగా ఇరుక్కుందని రకుల్ కే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కాగా రకుల్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రంలో నటిస్తోంది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా వికారాబాద్ లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అలాగే మరో రెండు బాలీవుడ్ సినిమాలతో పాటు, పాన్ ఇండియన్ సినిమా ఇండియన్ 2 లోను నటిస్తోంది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!