దోమ కాటు మాములుగా ఉండదు . ఒక్కసారి కుట్టిన కూడా రోగాలు రావడం ఖాయం . టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా రోగాలన్నింటికీ దోమలే మూలం అని మనందరికీ తెలిసిందే . అందుకే అవి కనిపిస్తే చాలు ఏ మాత్రం జాలి లేకుండా చంపేస్తుంటాం. కానీ ఎన్ని దోమల్ని చంపినా మళ్ళి ,మళ్ళి పుట్టుకొస్తూనే ఉంటాయి.అసలు వాటి ఉనికే లేకుండా చేయాలన్నాకూడా సాధ్యమయే విషయం కాదు.ఎందుకంటే దోమల సామ్రాజ్యం అంత పెద్దది. కానీ, చైనా లోని రెండు ద్విపాలలో వాటి సామ్రాజ్యాన్ని కూల్చేశారు శాస్త్రవేత్తలు. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు 2018లో.. జన్యు పరమైన సవరణ చేసిన మగ దోమలను సిద్ధం చేశారు. ఆ దోమ ల్లో వాల్బాచియా అనే బ్యాక్టీరియా ను ఎక్కించారు. ఆ బ్యాక్టీరియా పని ఏంటంటే.. మగ దోమలు ఆడ దోమల తో సంపర్కం జరిపినప్పుడు ఆడ దోమ ల్లోని గుడ్లు ఫలదీకరణం చెందకుండా చేయడమే. దానితో పాటు గా తక్కువ స్థాయి రేడియేషన్ను కూడా పరిశోధకులు సిద్ధం చేసి ఉంచుకున్నారు.చైనాలోని గ్యాంగ్ డాంగ్ ప్రావిన్సులో రోగాలకు కారణమయ్యే ఆసియన్ టైగర్ జాతి దోమలు ఎక్కువగా ఉంటాయి. జన్యుసవరణ చేసిన 10 లక్షల దోమల తో పాటు, తక్కువ స్థాయి రేడియేషన్ను అక్కడ ప్రవేశపెట్టారు. ఇంకేముంది.. మగ దోమలు ఆడ దోమల తో సంపర్కం చేసిన కూడా ఆ జాతి పెరగకపోవడం తో పాటు ,రేడియేషన్ కారణంగా దోమలు అన్ని చనిపోయాయి.
ఎన్నో రకాల రసాయనాలకు కూడా లొంగని ఈ జాతి దోమలు.. అక్కడి ద్వీపాల్లో మాత్రం కనిపించకుండా పోయాయి . ప్రయోగ దశలో మంచి ఫలితాలు వచ్చాయి అని , అంటు వ్యాధులకు పూర్తిగా అడ్డుకోవచ్చని , పంటలకు చీడ పట్టకుండా కూడా కాపాడుకోవచ్చని నిపుణులు తెలిపారు .