Chiranjeevi : చిరంజీవి సినిమా అంటే కథ.. మాటలు.. స్క్రీన్ ప్లే ముందు పక్కాగా కుదరాల్సిందే. కథ ఏమాత్రం చిరంజీవి కి నచ్చకపోయినా ప్రాజెక్ట్ పక్కన పడిపోతుంది. అందుకు ఉదాహరణ పూరి జగన్నాధ్ తో అనుకున్న ప్రాజెక్టే. మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా కోసం పూరి ఆటో జానీ అన్న టైటిల్ తో కథ రాశాడు. ఆ కథ మెగాస్టార్ తో పాటు నాగబాబు కి చెప్పాడు. నాగబాబు కి విపరీతంగా నచ్చింది. కాని చిరంజీవి కి మాత్రం సెకండాఫ్ అంత తృప్తిగా అనిపించలేదట. దాంతో సింపుల్ గా ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారు.
ఇక మలయాళ సూపర్ హిట్ సినిమా లూసీఫర్ రీమేక్ విషయంలో కూడా ముందు ప్రాజెక్ట్ కి సుజీత్ అని అనుకున్నారు. మూడు నెలల తర్వాత సుజీత్ చెప్పిన వెర్షన్ మెగాస్టార్ కి నచ్చకపోవడం తో సుజీత్ ని పక్కన పెట్టి వి.వి.వినాయక్ ని తీసుకు వచ్చారు. కాని వినాయక్ కూడా మెప్పించలేకపోయాడు. ఫైనల్ గా తమిళ దర్శకుడు మోహన్ రాజా వచ్చాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి రాబోతోంది. ఆచార్య షూటింగ్ దశలో ఉంది. షూటింగ్ చివరి దశకి చేరుకుందని అంటున్నారు. అందుకే మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టాడు.
Chiranjeevi : బాబీ కథ విషయంలో ఎవరినీ ఇన్వాల్వ్ చేయడం లేదట.
ఈ ప్రాజెక్ట్ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనుండగా యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు మెగాస్టార్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. అయితే బాబీ కథ విషయంలో ఎవరినీ ఇన్వాల్వ్ చేయడం లేదట. మెగాస్టార్ కోసం కంప్లీట్ గా తనే స్క్రిప్ట్ సిద్దం చేసుకుంటున్నాడట. బాబీ సొంత కథ తో తెరకెక్కించిన పవర్ .. జై లవ కుశ భారీ హిట్ సాధించాయి. వేరే రచయితల కథ తో తీసిన సినిమాలు బాబీ కి హిట్ ఇవ్వలేదు. అందుకే మెగాస్టార్ కోసం తానే అన్ని అయి చూసుకుంటున్నాడట.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?