నేచురల్ స్టార్ నాని నటించిన 25వ సినిమా ‘వి’. సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరీ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 5న నేరుగా మెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఈ సినిమాతర్వా చేయాలనుకున్న శ్యామ్ సింగరాయ్ కూడా ఈ పాటికి ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కాని కరోనా కారణంగా అన్ని సినిమాల మాదిరిగా నాని సినిమాలు నిలిచి పోయాయి.
ఇక సామాన్య ప్రజలే ధైర్యంగా బయటకు వచ్చి అన్ని పనులు చేసుకుంటున్న నేపథ్యంలో మన టాలీవుడ్ స్టార్స్ కూడా నెమ్మదిగా తమ సినిమాలను సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో నాని శ్యామ్ సింగరాయ్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ని ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తాజా సమాచారం. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. కాగా ఈ సినిమాలో సాయి పల్లవి ఒక హీరోయిన్ గా నటించబోతుందన్న వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు ఈ సినిమాలో సాయి పల్లవి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందట. అయితే అధికారకంగా ఈ విషయంలో ఇంకా చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా నాని మేకోవర్ తో పాటు పాత్ర కూడా చాలా వైవిధ్యంగా ఉండేలా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. చిత్రీకరణ మొదలు పెడితే శరవేగంగా టాకీపార్ట్ కంప్లీట్ చేసి 2021 ప్రారంభంలోనే రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.