Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి..సీఎం పీఠం లో కూర్చుని రెండు సంవత్సరాలు కాకముందే అనేక సార్లు బెస్ట్ సీఎంగా అనేక సర్వేలలో బయట పడటం జరిగింది. కాగా తాజాగా దేశవ్యాప్తంగా అత్యుత్తమ ముఖ్యమంత్రి గా ప్రజల చేత నీరాజనాలు పొందుతున్న సీఎం గా వైఎస్ జగన్ ని స్కోచ్ గ్రూపు సంస్థ గుర్తించడం జరిగింది.
ఈ సందర్భంగా స్కోచ్ గ్రూపు ఛైర్మన్ సమీర్ కొచ్చర్ స్కోచ్ సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డును సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అందించడం జరిగింది. ఒక ఏడాది పరిపాలనను ఆధారం చేసుకుని.. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో జగన్ కి ఈ స్థానం వచ్చినట్లు స్కోచ్ గ్రూపు ప్రతినిధులు తెలపడం జరిగింది. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, వైఎస్సార్ చేయూత, దిశ చట్టం, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రాతిపదికగా తీసుకుని ఆయనకు ఈ అవార్డును అందజేసినట్లు స్కోచ్ గ్రూప్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాజాగా సంస్థ చైర్మన్ వైయస్ జగన్ ని తాడేపల్లి లో క్యాంపు కార్యాలయంలో కలిసి అవార్డును అందజేశారు. దీంతో ఒకపక్క పంచాయతీ ఎన్నికలలో దాదాపు 80 శాతం స్థానాలు గెలవటం మరోపక్క ఇదే టైమ్ లో జగన్ కి అవార్డు రావడంతో వైసీపీ శ్రేణులు సంతోషంలో మునిగి తేలుతున్నాయి. గ్రామం నుండి దేశం వరకు జగన్ నినాదం భారీ స్థాయిలో మారుమ్రోగుతోంది కాలర్ ఎగరేసి చెబుతున్న జగన్ నీ గెలిపించినందుకు దేశం గర్వపడుతుంది అంటూ వైసిపి కార్యకర్తలు సోషల్ మీడియాలో ఈ వార్త పట్ల కామెంట్లు పెడుతున్నారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా మానవతా దృక్పథంతో జగన్ తనను గెలిపించిన ప్రజల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు జాగ్రత్తలు ఆయనకు అవార్డు తెచ్చిపెట్టినట్లు తాజా వార్త పై రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.