ఆంధ్ర ప్రదేశ్లో ఇప్పట్లో వైసీపీకి,జగన్ కిఎదురు లేదని అనేక సర్వేల్లో తేలుతోంది. ఎప్పటికప్పుడు వైసీపీ గ్రాఫ్ పెరిగిపోతుంటే ప్రతిపక్షాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి.
ప్రధాన ప్రతిపక్షమైన టిడిపిని పక్కన పెడితే మూడో ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న బిజెపి జనసేనల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. ఎక్కడైనా రాజు గానీ ఏపీలో మాత్రం కాదన్నట్లుగా మోడీ పొలిటికల్ గ్లామర్ ఏపీకి వచ్చేసరికి చిత్తు అవుతోంది. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. పార్టీగా బీజేపీ జనాలకు బహు దూరంగా ఉంది. అదే విధంగా ఆ పార్టీలో విభిన్న భావజాలం కలిగిన నాయకులు కలసి కలగూర గంపను చేసి పారేశారు. మరో వైపు ఏపీకి బీజేపీ ఏమీ చేయలేదన్న భావన జనంలో ఇప్పటికీ ఉంది. ప్రత్యేక హోదా మోడీ దృష్టిలో ముగిసిన అధ్యాయం అయితే కావచ్చు, కానీ ప్రజలు మాత్రం మరవలేదు, అలాగే ఏపీకి ఆర్ధిక ఇబ్బందులు, రాజధాని నిర్మాణం కాకపోవడం, అప్పులూ ఇవన్నీ కూడా బీజేపీ ప్రాప్తమేనని ప్రజలు భావిస్తున్నారు. దానితో పాటు పవన్ జనసేన కూడా నాడు పాచిపోయిన లడ్లూ అంటూ ప్యాకేజిని విమర్శించి ఇపుడు చేతులు కలపడాన్ని పక్కా రాజకీయంగానే జనం చూస్తున్నారు.
అందుకే ఈ రెండు పార్టీల కలయిక ఏ మాత్రం ప్రభావం చూపించడం లేదని తాజా సర్వేలు చెబుతున్నారు.పవన్ని కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తూ జనసేన ఉంటే, బీజేపీతో పొత్తు, మోడీ పొలిటికల్ గ్లామర్ కలసి రెండు పార్టీలకు మేలు జరుగుతుందని ఆశించారు. అందుకే పొత్తు పెట్టుకున్నారు కూడా. అలా పొత్తు పెట్టుకుని ఇప్పటికి ఏడు నెలలు గడచినా కూడా జనంపైన ఆ ప్రభావం ఏదీ లేదని తేలుతోంది.ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా ఓటు షేరు కేవలం ఆరు శాతం మాత్రమేనని ఒక సర్వేలో తేలిందిఇక్కడో చిత్రం ఏంటంటే టీడీపీ ఓటు షేర్ కూడా గణనీయంగా తగ్గిపోయింది.
మూడవ ఆల్టర్నేషన్ అని చెపుకునే బీజేపీ, జనసేనలకు కాకుండా వైసీపీకి మొత్తం ఓట్ షేర్ మళ్ళడాన్ని బట్టి చూస్తూంటే విపక్షానికి ఏపీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయనే విశ్లేషించాల్సిఉంటుంది.ఇక వైసీపీ ఓ వైపు గత ఎన్నికల ఓట్ల శాతం 50 నుంచి 55గా పెంచుకుందని ఒక పాపులర్ సర్వే చెబితే వైసీపీ సొంతగా చేసుకున్న సర్వేలో అది 58 శాతం అయింది.ఇప్పట్లో జగన్ కి దరిదాపుల్లో ఏపీలో ప్రతిపక్షాలేవీ లేవని అన్ని విధాలా స్పష్టమవుతోంది!