జగన్ కష్టాల్లో ఉన్నప్ప్పుడు ఆయనకు తోడుగా నిలవడంలో విఫలమయ్యింది సమర్ధవంతమైన ఆయన వర్గం.. అని కామెంట్లు వినిపించాయి. కానీ… వైఎస్ వర్గంగా చలామణి అయినవారిలో కేవీపీ వర్గమే ఎక్కువని, వారు కేవీపీ వర్గంగా ఉంటూనే.. వైఎస్ సన్నిహితులుగా మెలిగేవారని అంటున్నారు! అసలు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది.. వైఎస్ – కేవీపీ వేరు వేరు కాదు కదా! అన్న క్లారిటీ ఉన్నా… ప్రస్తుతం కేవీపీ రహస్య వర్గం అనబడేవారు, కెవీపీతో బంధాలు కలుపుకున్నవారు వరుసపెట్టి జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు! దీనికి కారణం… బీజేపీ – టీడీపీ వర్గానికి కేవీపీ ఇప్పుడు కీలక దిక్కుగా మారారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతకొన్ని రోజులుగా కేవీపీ వర్గమైన ఉండవల్లి అరుణ్ కుమార్, రఘురామకృష్ణం రాజు, సబ్బం హరి, శైలజానాథ్, ధర్మానప్రసాద్ రావు మొదలైన వారు జగన్ ను టార్గెట్ చేసినట్లు కనిపించడమే దీనికి కారణం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జగన్ పార్టీలో ఉన్న నేతల్లో కేవీపీ వర్గం బాగానే ఉంటుందని, ఆ వర్గాన్ని కాస్త బీజేపీ వైపు లాగగలిగితే.. జగన్ కు దెబ్బపడుతుందని భావిస్తున్నారంట. ఇలాంటి ఊహాగాణాలు ఏపీ కేంద్రంగా గతకొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. పైగా రఘురామకృష్ణం రాజు వ్యవహారం వెనక కూడా.. ఆయన వియ్యంకుడు కేవీపీ ఇచ్చిన మద్దతే కారణం అని అంటున్నారు!!
దీనంతటికీ కారణం… జగన్ పనుల వల్ల ఒక సామాజికవర్గం ఆర్ధికంగా పూర్తిగా దెబ్బతింటుందనే కక్షే కారణం అని తెలుస్తోంది. ఈ లాజిక్కుల్లో కేవీపీ కీలకంగా మారగా, ఆయనకు పూర్తిగా బీజేపీ, టీడీపీలు మద్దతు ఇస్తున్నాయని.. జగన్ ఏ విషయంలో వెనక్కి తగ్గకపోవడం, జగన్ దగ్గర బేరాలు లేకపోవడంతో వ్యవహారం కేవీపీ కోటరీ అనే వరకూ వచ్చిందని అంటున్నారు!! ఈ గాసిప్స్ సంగతి అలా ఉంచితే… జనంలో జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి.. ఈ అధికార దాహంతో చేసే ఎత్తులకు, పైఎత్తులకు జగన్ భయపడాల్సిన అవసరం లేదని, రాజకీయాలపట్ల జగన్, జనం అప్పట్లా కాకుండా చాలా ఆలోచనతో ఉన్నారని మరికొందరు అంటున్నారు!! ఏది ఏమైనా… ఏపీ రాజకీయాల్లోకి కేవీపీ ఎంట్రీ, కేవీపీ వర్గం వంటి మాటలు సంచలనంగా మారాయనే చెప్పాలి!