ఎవరు అవునన్నా కాదన్నా… కరోన విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా ముందుకు వెళ్తుంది. భారతదేశంలోనే అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రంగా నిలవడంతోపాటు.. ఇప్పటికీ రోజుకు సుమారు 24వేల పరీక్షలు జరుపుతున్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచనున్నారని కూడా ప్రకటనలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మహమ్మారిపై సమరశంఖం పూరించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇందుకోసం ఆయన భారీ ప్లాన్ నే సిద్ధం చేశారు.
ఈ సందర్భంగా… రాష్ట్రంలో టెస్టుల సంఖ్య పెర్గడం, కేసుల సంఖ్యలు పెరగడం ఒక నిత్యకృత్యంగా మారిపోయిన ఈ తరుణంలొ.. ఈ మహమ్మారికోసం రాష్ట్రం మొత్తం జల్లెడపట్టాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. ఇందులో భాగంగా.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కరోనా పరీక్ష చేయాలని డిసైడ్ చేయటమ కాదు.. అందుకు తొంభై రోజుల టైం బౌండ్ కూడా పెట్టుకుంది ఏపీ సర్కార్. రాష్ట్రం మొత్తం పరీక్షలు జరిపించటం అంటే మాటలు కాదు.. అందుకు భారీ ప్లాన్ కావాలన్న సందేహం అవసరంలేదు.. ఈ విషయంలో జగన్ సర్కార్ ఇప్పటికే సక్సెస్ అయినట్లే!
ఈ ప్లాన్ లో భాగంగా… ప్రతి మండలానికి ఒక 104 వాహనాన్ని కేటాయిస్తారు. నమూనాలు సేకరించే ఏర్పాట్లు అందులో ఉంటాయి. 104 సిబ్బందితో పాటు ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు ఈ టీం లో ఉంటారు. వీరంతా ఇంటింటికి తిరగి, పరీక్షలు జరిపి, అక్కడిక్కడే మందులు ఇస్తారు! ఇందులో భాగంగా జులై ఒకటి నాటికి 104.. 108 వాహనాల్ని సిద్ధం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వైరస్ ను పూర్తిగా జల్లెడపట్టడంతోపాటు, వైరస్ వ్యాప్తి మరింత వ్యాపించకుండా చేయడం, తద్వారా మరణాలు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఒకేసారి జరిగేలా జగన్ సర్కార్ ప్లాన్ చేస్తుంది.
కరోనా విషయంలో ఏపీ సర్కార్ అంత దూకుడుగా, అంత పక్కా ప్లానింగ్ తో ఉంటే… తెలంగాణ సర్కార్ ఏమి చేస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! ఇప్పటికే ఈ విషయంలో కోర్టులు చెప్పేవి చెబుతున్నాయి, మేధావులు చెప్పేవి చెబుతున్నారు, ప్రతిపక్షాలు అనేవి అంటున్నాయి. ఈ క్రమంలో ముందు ముందు కేసీఆర్ కూడా కరోనా విషయంలో ఒక భారీ యుద్దమే ప్రకటించాలని, ఈ మహమ్మారి విషయంలో పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వీడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?