ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల జగన్ కలకు శాసన మండలి ద్వారా చెక్ పెట్టిన చంద్రబాబుకు… జగన్ ఈ మధ్య కాలంలో షాకుల మీద షాకులు ఇస్తున్నారు. టిడిపి నేతల అరెస్టు మొదలుకొని తాజాగా లీక్ అయిన నిమ్మగడ్డ రమేష్ హోటల్ మీటింగ్ వ్యవహారం వరకూ ప్రతి ఒకటి బాబు ని టార్గెట్ చేస్తూ చేసినవే కావడం గమనార్హం.
ఇదిలా ఉండగా అప్పుడు శాసనమండలిలో మూడు రాజధానులు బిల్లు ని అడ్డగించిన చంద్రబాబు వైఖరి నచ్చక టిడిపి నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు మండలిలో ఎమ్మెల్సీ పదవి కోసం ఎన్నికలు జరగనుండగా మాణిక్యవరప్రసాద్ వైసిపి తరఫునుండి నామినేషన్ వేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక అవతలి వైపు నుండి ఎవరు నామినేషన్ వేయకపోవడంతో డొక్కా మాణిక్య వర ప్రసాద్ వైసీపీ ఎమ్మెల్సీ గా ఎన్నిక కావడం ఏకగ్రీవం అయిపోయింది.