ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు ఏపీ శాసన మండలి లో కొనసాగుతున్న అధికార మరియు ప్రతిపక్షాల వాగ్వాదం నడుమ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. మోడీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ ఆర్ సి మరియు ఎన్ పి ఆర్ లకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని తేల్చి చెప్పింది.
డిప్యూటీ ముఖ్యమంత్రి అంజద్ భాషా మాట్లాడుతూ మన దేశంలో ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితి నెలకొందని…. ఎంతోమంది సోదర సోదరీమణులను వారి తల్లిదండ్రుల వివరాలకు మరియు వారి జన్మభూమికి సంబంధించిన ఆధారాలు ఏవని అడగడం ఖచ్చితంగా ఆమోదించదగ్గ విషయం కాదని ఏపీ ప్రభుత్వం తన వాదనను వినిపించింది.
అలాగే తాము కేంద్రం చేపట్టిన ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ చట్టాలకు వ్యతిరేకమని తేల్చి చెప్పిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణమే ఈ బిల్లులను ఉపసంహరించుకోవలసిందిగా కోరింది. ఇదిలా ఉండగా అధికార, విపక్ష పార్టీల మధ్య మిగతా బిల్లుల పైన తీవ్ర స్తాయిలో వాగ్వాదాలు జరుగుతూఉండగా…. నిరవధికంగా శాసన మండలి సమావేశం వాయిదా పడింది.