Ys Jagan: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు వైయస్సార్ బీమా పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో లో ఏ కుటుంబం అయినా.. కుటుంబ పెద్దను కోల్పోతే వారికి అండగా ఉండేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు జగన్ స్పష్టం చేశారు. దాదాపు 750 కోట్ల రూపాయలతో 2021-2022 సంవత్సరానికి బీమా రక్షణ కల్పిస్తున్నట్లు.. స్పష్టం చేశారు.
ఈ పథకం అమలు చేయడానికి బ్యాంకు లతో సంబంధం లేదని.. కుటుంబ పెద్ద కోల్పోయిన కుటుంబానికి భరోసా ఇవ్వడానికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని లక్షల కుటుంబాలు వైయస్సార్ భీమా పరిధి లోకి రావటం జరిగాయని.. 18 నుండి 50 సంవత్సరాల లోపు వ్యక్తులు మరణిస్తే.. సహజంగానే లక్ష రూపాయలు పరిహారం అందుతుందని అదే రీతిలో 18 నుంచి 70 ఏళ్లు లోపు ఉన్న వ్యక్తులు మరణిస్తే 5లక్షల పరిహారం అందించనున్నట్లు స్పష్టం చేశారు.
Read more: YS Jagan: జగన్కు షాక్… కేసీఆర్ కు ఝలక్ ఎలా అంటే…
రెండేళ్ల కాలంలో వైఎస్ఆర్ బీమా కోసం 1307 కోట్లు ఖర్చు చేసినట్లు జగన్ తెలిపారు. 2020 ఏప్రిల్ మాసం నుండి ఈ పథకం నుండి కేంద్రం పక్కకు తప్పుకోవడం జరిగిందని.. కేంద్రం పక్కకు వెళ్లిపోయిన్నా గాని రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో.. పథకం కొనసాగిస్తున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. పేదల పై ఎటువంటి భారం లేకుండా ఈ బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.