NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

‘ఓటర్ల జాబితా తప్పుల తడక’

ఢిల్లీ, ఫిబ్రపరి 4: ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని వైసిపి అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సోమవారం  ఆయన పార్టీ నాయకులను వెంట తీసుకుని  కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్ అరోరాను కలిశారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక రీతిలో అధికార తెలుగుదేశం పార్టీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడిందని చెప్పారు.

అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను టిడిపి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని జగన్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశాలను కూడా ప్రస్తావించారు. సర్వేల పేరుతో టిడిపి వ్యతిరేక ఓటర్లను జాబితా నుండి తొలగిస్తున్నారని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఈసి) సునీల్ అరోరాకు ఫిర్యాదు చేస్తూ కొన్ని ఆధారాలను సమర్పించినట్లు జగన్ మీడియాకు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలంటే ప్రధానంగా డిజిపి ఠాకూర్, ఇంటలిజెన్స్ అడిషనల్ డిజి ఎబి వెంకటేశ్వరరావు, డిఐజి (శాంతి భద్రతలు) ఘట్టమనేని శ్రీనివాస్‌లను ఎన్నికల విధుల నుండి తప్పించాలని సిఇసిని కోరినట్లు తెలిపారు.

రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం దగాకోరు విధానాలను అవలంబిస్తున్నదని విమర్శించారు.

చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన 35మంది సిఐలకు ప్రమోషన్‌లు ఇచ్చారని అన్నారు.

నకిలీ, బోగస్ ఓట్లు తొలగించాలని కోరామని చెప్పారు.

రాష్ట్రంలో 60లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని, వీటిలో 20లక్షల ఓట్లు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో రెండు చోట్ల ఉండగా 40లక్షల ఓట్లు ఆంధ్రరాష్ట్రంలోనే రెండు చోట్ల ఉన్నాయని జగన్ అన్నారు. ఈ నకిలీ ఓట్లు తొలగించడంతో పాటు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకే రోజు ఎన్నికలు జరిగేలా చూడాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్పారు.

ప్రజా సాధికార సర్వే, రియల్ టైమ్ గవర్నెన్స్ తదితర సర్వేల పేరుతో వైసిపికి అనుకూలంగా ఉన్న సుమారు 4లక్షల ఓట్లు తొలగించారని జగన్ ఆరోపించారు.

 

ఇవిఎంలతో ఏదో జరిగిపోతుందని గగ్గోలు పెడుతున్న చంద్రబాబు 2014 ఎన్నికల్లో ట్యాంపరింగ్ చేసే గెలిచారా అని జగన్ ప్రశ్నించారు. ‘మా పార్టీ మీద ఒక శాతం ఓట్ల తేడాతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచిందని’ జగన్ అన్నారు.

ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికలు చూశాం. మూడు రాష్ట్రాల్లో బిజెపి ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది, నిజంగా ట్యాంపరింగ్ జరిగి ఉంటే ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయి అధికార బిజెపి గెలిచేది కదా అని జగన్ ప్రశ్నించారు. ఏది మాట్లాడినా లాజిక్ అనేది ఉండాలని జగన్ అన్నారు.

ఎలాగూ ఓడిపోతున్నామని తెలుసుకాబట్టి ఆ నెపాన్ని ఈవిఎంలపై వేయాలని చంద్రబాబు చూస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Leave a Comment