ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్య విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను చేర్చడంతో పాటు ప్రీ ప్రైమరీ విద్యను కూడా మొదలుపెట్టాలని నిర్ణయించుకున్న విషయం తెల్సిందే.
ఇక ఇప్పుడు ఉన్నత స్థాయి విద్యపై జగన్ దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ లో 13 మోడల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు జగన్ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ప్రతీ జిల్లాకు ఒక మోడల్ డిగ్రీ కాలేజ్ ఉండేలా జగన్ చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం ఏకంగా 40.62 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాకింగ్ ఫ్రేమ్ వర్క్ సంస్థకు పైలట్ ప్రాజెక్టుగా ఈ మోడల్ కాలేజీల ఏర్పాటును అప్పగించారు. ఇప్పటికే 13 కాలేజీలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.