ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్కారు సంక్షేమ పథకాలతో వరుసగా రెండో సంవత్సరం కూడా దూసుకు వెళుతోంది. ఆయా సామాజిక వర్గాలకు లబ్ధి చేకూరేలా జగన్ నవరత్నాలలో భాగంగా ప్రవేశపెట్టిన అనేకానేక సంక్షేమ పథకాలు ఒకదాని వెంట ఒకటి ప్రజల వద్దకు చేరుతున్నాయి. తాజాగా వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని జగన్ వరుసగా రెండో సంవత్సరం కూడా విజయవంతంగా అమలు చేయడం జరిగింది.
దీంతో కొద్ది సేపటి క్రితమే లబ్దిదారుల ఖాతాలోకి నేరుగా 24 వేల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కారణంగా 81,024 మందికి లబ్ధి చేకూరుతుంది. 2020-21 ఏపీ ప్రభుత్వం గ్రామ మరియు వార్డు వాలంటీర్ల ద్వారా సర్వే చేయించి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసింది.
అసలు నెల 17న ఏపీ సర్కార్ ఈ పథకాన్ని అమలు చేయాల్సింది కానీ అసెంబ్లీ సమావేశాల కారణంగా 20వ తేదీకి వాయిదా వేశారు. పెట్టుబడుల కోసం ఇబ్బంది పడకూడదని మరియు వారి ఆత్మ గౌరవం కోసం సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. అదే కాకుండా అర్హులు ఎవరైనా ఉంటే ఈ నెలాఖరు లోగా దరఖాస్తు చేసుకోవచ్చని కూడా చెప్పిన జగన్ తాను ఎక్కడైనా ఎవరినైనా మిస్ చేస్తానేమో అని భయపడుతూ ఉంటానని అన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?