వరస సంక్షేమ పథకాలతో ముందడుగు వేస్తోన్న వైఎస్ జగన్ సర్కారు నేడు మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ లో నేడు వైఎస్ జగన్ తానిచ్చిన హామీల్లో ఒకదాన్ని నెరవేర్చారు. నేడు అమరావతిలో సీఎం క్యాంప్ కార్యాలయం నుండి వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు.
అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుండి ఈ పథకాన్ని అమలు చేస్తామంటూ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయం తెల్సిందే. నేడు ఇచ్చిన మాట ప్రకారంగా ఆ హామీ నేటి నుండి అమలు కానుంది. 8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.27,168.83 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో నేరుగా ఆయా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేయనుంది. తొలి విడతలో రూ.6,792.20 కోట్లను ఆయా కార్పొరేషన్ల ద్వారా నేడు జమ చేశారు.