ఉద్దేశపూర్వకంగా ఏపీ సీఎం వైయస్ జగన్ పై బురదజల్లే విధంగా రామోజీరావు పత్రిక అదేవిధంగా ఏబీఎన్ ఆర్కే పత్రిక ఇష్టానుసారం అయిన వార్తలు రాస్తాయని ఏపీ రాజకీయాల్లో ఎప్పటినుండో టాక్ ఉంది అని అందరికీ తెలిసిందే. జగన్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూ ప్రజలలో జగన్ ఇమేజ్ డేమేజ్ అయ్యే విధంగా ఈ పత్రికలు కథనాలు ప్రచురితం చేస్తాయని ఏపీ రాజకీయ నేతలు ఎక్కువగా అంటుంటారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న గానీ ఈ పత్రికలు వైయస్ జగన్ ని ఏ మాత్రం కనికరించడం లేదని సమాచారం. చాలా వరకు ఇలాంటి సమస్యలు వస్తాయని ముందుగానే అధికారంలోకి వచ్చాక వైయస్ జగన్ మీడియా విషయాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయినా ఈ పత్రికలు అధినేతలు ఎక్కడా తగ్గడం లేదట.
విషయంలోకి వెళితే సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ సంస్థకు మంజూరు చేసిన మైనింగ్ లీజ్ లో జగన్ సర్కార్ అవినీతికి పాల్పడిందని.. గత కొన్ని రోజుల నుండి ఈనాడు, ఆంధ్రజ్యోతి మరియు చంద్రబాబు వైసిపి ప్రభుత్వం పరువు దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ మైనింగ్ లీజ్ విషయంలో ఇష్టానుసారం అయిన కథనాలు ప్రచురితం చేసిన ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి పత్రికలపై చర్యలు తీసుకోబోతున్నాట్లు చెప్పుకొచ్చారు.
ఈ విషయంలో పత్రికా యాజమాన్యాలు క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ముందుగా ఈ విషయంలో ప్రభుత్వ పరంగా వివరణ ఇచ్చినా గాని కావాలని సదరు పత్రికలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రభుత్వంపై బురదజల్లే విధంగా వార్తలు రాస్తున్నట్లు…ఈ విషయంలో జగన్ సర్కార్…. పత్రిక యాజమాన్యాలను ప్రతిపక్ష నేత చంద్రబాబుని కోర్టు మెట్లు ఎక్కించడానికి రెడీ అవుతున్నట్లు ఏపీ మీడియా సర్కిల్ లో వార్తలు వస్తున్నాయి. కాగా ఇప్పటికే ఈ విషయంలో చంద్రబాబుకి మరియు పత్రికల యాజమాన్యాలకు లీగల్ నోటీసులు ఇచ్చినట్లు గోపాలకృష్ణ ద్వివేది చెప్పుకొచ్చారు.