Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు తీసుకుని పరిపాలన చేస్తున్న సంగతి తెలిసిందే. పేదలకు నేరుగా ప్రభుత్వ పథకాలు ఇంటి వద్దకే చేరుకునే విధంగా డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో జగన్ చెప్పటం జరిగింది. ఏ ఒక్కరు కూడా దేహి అని ఎవరి దగ్గర.. చెయ్యి చాప కుండా పథకాలు అందిస్తానని తెలిపారు. ఆ విధంగానే సంక్షేమ పథకాలతో రెండు సంవత్సరాలలో ఊహించని విధంగా… దేశంలో చాలా రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఏపీ వైపు చూసే తరహాలో జగన్ పాలన ఇస్తున్న సంగతి తెలిసిందే.
లోటు బడ్జెట్ కలిగిన గాని రాష్ట్రంలో ఏ పేదవాడు నష్టపోకుండా జగన్ అందిస్తున్న చాలా సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రంలో అమలు చేయాలని ఇప్పటికే ఆలోచన చేస్తూ ఉన్నారు. పరిస్థితి ఇలా ఉండగా తాజాగా మరో అదిరిపోయే హంగులతో జగన్ సర్కార్ రాష్ట్రంలో స్మార్ట్ సిటీస్ నిర్మించడానికి రెడీ అవుతుంది. సకల వసతులతో ఈ స్మార్ట్ టౌన్ల నిర్మాణం చేపట్టాలని జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
ఈ స్మార్ట్ టౌన్ లలో… సచివాలయం, మార్కెట్, బ్యాంక్, ఆరోగ్య కేంద్రం, పాఠశాల భవనం, అంగన్వాడీ కేంద్రం, షాపింగ్ మాల్ మరియు కమ్యూనిటీ హాల్ అన్ని వసతులు ఒకే చోట ఉండేలా… ప్రజలు ఇబ్బంది పడకుండా అదిరిపోయే తరహాలో వీటిని నిర్మించాలని.. అనుకుంటుందట. అంతేకాకుండా వాకింగ్ ట్రాక్, పిల్లల కోసం ఆటస్థలం, నీటి సరఫరా కోసం ఓవర్హెడ్ ట్యాంకు , వీధి దీపాలు, డ్రైనేజీ, విద్యుత్ సబ్ స్టేషన్, ప్లాంటేషన్, సోలార్ ప్యానల్ లు ప్రజలకు అందుబాటులోకి ఉండేవిధంగా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం.