YS Jagan: వైయస్ జగన్(YS Jagan) ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే రీతిలో.. సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. కరోనా లాంటి కష్ట సమయంలో.. ఉద్యోగాలు ఉపాధి లేక.. అనేక రాష్ట్రాలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఏపీలో అటువంటి పరిస్థితి లేకుండా.. ఆ సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందించి ప్రజల వారు చేతులు చాచే పరిస్థితి ఏర్పడకుండా జగన్(YS Jagan) ప్రభుత్వం వ్యవహరించడం జరిగింది. పక్క రాష్ట్రాలలో ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిన గాని ఏపీలో మాత్రం అటువంటి పరిస్థితి లేకుండా.. తనను గెలిపించిన ప్రజలకు.. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆదుకోవడం జరిగింది.
అంతమాత్రమే కాకుండా ప్రజలు ప్రభుత్వాలు అందించే పథకాలకు.. నాయకులు చుట్టూ తిరగకుండా నేరుగా వారి అకౌంట్లోనే డబ్బులు పడే రీతిలో… ఎక్కడా కూడా అవినీతికి తావులేకుండా.. సంక్షేమ పథకాలు జగన్ ప్రభుత్వం(Jagan Governament) అందిస్తూ వస్తోంది. మహిళలకు విద్యార్థులకు రకరకాల సామాజిక వర్గాలకు అందిస్తున్న జగన్ ప్రభుత్వం(Jagan Governament) తాజాగా పేద బ్రాహ్మణుల కుటుంబాలకు కూడా సరికొత్త సంక్షేమ పథకాన్ని ప్రకటించడం జరిగింది. విషయంలోకి వెళితే రాష్ట్రంలో పేద బ్రాహ్మణుల అంత్యక్రియలకు 10 వేల ఆర్థిక సహాయాన్ని అందించాలని జగన్(YS Jagan) ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.
40 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి..
గరుడ సహాయ పథకం ద్వారా ఈ సాయాన్ని పేద బ్రాహ్మణులకు అందించాలని.. నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఏడాది ఆదాయం 75 వేల రూపాయలు మించకూడదని.. షరతు విధించడం జరిగింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు 40 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటూ http://andhrabrahmin.ap.gov.in అనే వెబ్ సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. 40 రోజుల లోపు ఈ పథకం కావాలనుకొనే వారు దరఖాస్తు చేసుకోవాలని వైసీపీ ప్రభుత్వం సూచించింది.