తిరుమల, జనవరి 10: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. గురువారం అలిపిరి మార్గంలో కాలినడకన ఆయన తిరుమలకు చేరుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఆయన క్యూలైన్లో వెళ్లి దర్శనం చేసుకోనున్నారు.
అలిపిరి పాదాల వద్ద మెట్లకు మొక్కి ఆయన నడక ప్రారంభించారు. శ్రీవారి దర్శనానంతరం ఆయన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకోనున్నారు. రాత్రికి ఆయన తిరుమలలో బస చేసి శుక్రవారం ఇడుపులపాయకు బయలుదేరి వెళతారు.
బుధవారం ప్రజాసంకల్పయాత్ర పూర్తి చేసిన తర్వాత ప్రతిపక్ష నేత నేరుగా స్వామి దర్శనానికి బయలుదేరి వచ్చారు.
previous post
next post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?