YS Jagan: వైఎస్ జగన్ YS Jagan గుజరాత్ కు చెందిన అమూల్ డైయిరీని ఏపీకి తీసుకొచ్చారు. ఇందుకు కారణమేంటంటే.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు చెందిన హెరిటేజ్ సంస్థతోపాటు, కొందరు టీడీపీ నాయకుల ఆర్ధిక మూలాలు పాడి పరిశ్రమల్లోనే ఉన్నాయి. సంగం, మోడల్, విశాఖ.. ఇలా డెయిరీల్లో వారికి వాటాలున్నాయి. రైతుల నుంచి పాల సేకరణ చేస్తూ వారికి తక్కువ మొత్తం చెల్లించి పైన వీరు లాభాలెక్కువ పొందుతున్నారని ఓ వాదన. కాబట్టి.. రైతులకు ఎక్కువ లాభం దక్కేలా, టీడీపీ నాయకుల ఆర్ధిక మూలాలు దెబ్బ తినేలా చేయాలనే వ్యూహహే సీఎంకు ఉందని చెప్పాలి. ఇది సదుద్దేశమే అయినా.. అందుకు వేసిన అడుగులు సరైన దారిలో కాదని చెప్పాలి.
రాష్ట్ర ప్రభుత్వ నిధులను అమూల్ కి పెట్టొద్దు అని ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులే దీనిని నిరూపిస్తున్నాయి. నిజానికి అమూల్ సంస్థ ఉత్తరాదిలో లాభార్జనే కాకుండా బ్రాండింగ్ లో కూడా టాప్ లో ఉంది. కానీ.. సౌత్ లో ఫెయిల్ అయింది. హైదరబాద్ లో గతంలోనే విఫలమైన సంస్థ. ఇప్పుడు జగన్ దీనిని ఏపీకి తీసుకొచ్చారు. హెరిటేజ్ సంస్థకు రోజుకు జరుగుతున్న 15లక్షలకు పైగా పాల సేకరణను అమూల్ సంస్థకు సేకరించేలా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు ఒంగోలు డెయిరీని కూడా అమూల్ కు ఇచ్చారు. కానీ.. రోజుకు 15వేల లోపు లీటర్లు మాత్రమే పాల సేకరణ జరుగుతోంది. ఏపీలో ఎవరూ అమూల్ కు పాలు పోసేందుకు ఇష్టపడటం లేదు.
Read More: Covid Hospital: ఏపీ ప్రభుత్వం అద్భుతం..! 15 రోజుల్లోనే కోవిడ్ ఆసుపత్రి నిర్మాణం
నిజంగా సీఎంకు పాడి రైతుల అభివృద్ధే ముఖ్యం అనుకుంటే.. ప్రభుత్వ సంస్థలైన ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలెప్ మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ (apddcf), లేదా నేషనల్ డెయిరీ డెవలెప్ మెంట్ బోర్డ్ (nddb)లకే ప్రభుత్వ నిధులను ఇచ్చి ఏపీలోని రైతుల నుంచి పాల సేకరణ చేస్తే సరిపోయేది. ఇదే చేస్తే జగన్ ఆలోచన మేరకు టీడీపీ నాయకుల ఆర్ధిక మూలాలపై దెబ్బ వేసినట్టూ ఉండేది.. రైతులకు మేలూ జరిగేది. దీనికి సచివాలయ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకుని రైతులకు మేలు చేయొచ్చు. కానీ.. జగన్ గుజరాత్ కు చెందిన సంస్థనే ఎందుకు తెర మీదకు తెచ్చారన్నది ప్రశ్న. ఇప్పటికే గంగవరం, కృష్ణపట్నం పోర్టుకు కూడా గుజరాత్ సంస్థకే అప్పగించింది ప్రభుత్వం. గుజరాత్ పై ప్రేమేంటో.. హైకోర్టే తేల్చాలి..!