వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ అడుగుపై కొత్త చర్చ మొదలైంది.
ఏపీలో పాలనా వికేంద్రీకరణ పేరిట అక్కడ శాసన రాజధాని అనేదాన్ని మాత్రం కొనసాగిస్తూ పాలనా రాజధానిని విశాఖకు తరలించాలని , న్యాయ రాజధాని పేరుతో కర్నూలుకు హైకోర్టు తరలించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై వివాదం చెలరేగుతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడంతో…వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరనుందా? అనే చర్చ మొదలైంది.
ఎన్నో సమస్యలు
మూడు రాజధానుల ఏర్పాటుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోగా…అమరావతిని రాజధానిగా కొనసాగించాలని క్షేత్ర స్థాయిలో ఉద్యమం పరిమితంగానే సాగుతోంది. అయితే, వైసీపీయేతర పార్టీన్నీ రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నాయి. ఏపీ సర్కారు నిర్ణయం శాసనమండలి గండం దాటి గవర్నర్ సంతకం కూడా పొంది గెజిట్లో వెలువడింది కూడా. అయితే హైకోర్టు ధర్మాసనం వద్దకు చేరింది. వైఎస్ జగన్ సర్కారు నిర్ణయంపై దాదాపు 80 పిటిషన్లు దాఖలైనా అన్నిటికీ కలిపి ఒకే కౌంటర్ను రాష్ట్రం సమర్పించింది. తద్వారా ఎన్ని విమర్శలు ఎదరైనా మూడు రాజధానులపై వెనక్కి తగ్గడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇదే సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంది. కేంద్రం రాష్ట్ర నిర్ణయానికి ఓకే చెప్పేసింది. పలు దఫాలుగా తమ వైఖరి తేల్చిచెప్పింది.
మళ్లీ మళ్లీ అదే మాట
పలు సందర్భాల్లో ఏపీలో మూడు రాజధానులపై తన వైఖరిని స్పష్టం చేసిన కేంద్రం ప్రభుత్వం.. రాజధాని అంశం మా పరిధిలో లేదంటూ తేల్చేసింది. రాజధానులను నిర్ణయించుకునే హక్కు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశం అని పేర్కొన్న కేంద్రం.. ఇదే అంశాన్ని గతంలోనే ఏపీ హైకోర్టుకు తెలియజేసింది. హైకోర్టు ఇచ్చిన నోటీసులపై మరోసారి స్పందించి కేంద్రం.. సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని అంశం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది… ఏపీ రాజధాని అంశంలో జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది.
కొత్త చర్చ ఇదేనా?
రాజధాని అమరావతిలోనే ఉంటుంది. భయపడాల్సింది లేదు అని కొందరు బీజేపీ నేతలు స్టేట్మెంట్లు ఇస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం ఇప్పటికే అనేక దఫాలుగా క్లారిటీ ఇచ్చింది. దీంతో కొత్త చర్చ మొదలైంది. బీఏపీ పెద్దలకు తెలిసే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని , గతంలో అమరావతి రూపంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన చర్యలను గమనిచంఇన బీజేపీ పెదద్లు ఈ మేరకు ఆయనకు అండగా నిలుస్తున్నారని అంటున్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే, ఏనాటికైనా ఎన్డీఏ గూటికి వైసీపీ చేరుతుందేమో అంటూ ఇంకొందరు ఊహాగానాలు వినిపిస్తున్నారు.