“మూడ్ అఫ్ ది నేషన్” గత ఏడాది చేసిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడో ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. కాగా మళ్లీ నాలుగు నెలల వ్యవధిలో ఇదే సంస్థ చేసిన సర్వేలో తాజాగా జగన్ ర్యాంక్ మూడో స్థానం నుండి ఆరో స్థానం లోకి పడి పోవటం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
గతసారి 11 శాతం ఆమోదంతో మూడో ర్యాంకులో ఉన్న జగన్, ఈసారి 6 శాతం రాబట్టి ఆరో స్థానం లోకి పడి పోయారు. ఈ సర్వేలో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో కలసి ఆరో ర్యాంకు సాధించారు. ఇందులో 24 శాతం మద్దతుతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మొదటి స్థానంలో ఉంటే, 15 శాతం తో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు.
9 శాతంతో మమతా బెనర్జీ మూడో స్థానంలో, ఏడు శాతం తో బీహార్ ముఖ్యమంత్రి నాలుగో స్థానంలో ఉంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే స్థానంలో నిలిచారు. ఆరో స్థానానికి వచ్చేసరికి జగన్ మరియు ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. మొన్ననే ఏబీపీ సి ఓటర్ సర్వేలో మూడో స్థానంలో నిలవగా తాజాగా ఇండియాటుడే నిర్వహించిన ఈ సర్వేలో జగన్ ఆరో స్థానంలో నిలవడంతో.. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇదే సంస్థ అంతకుముందు చేసిన సర్వేలో మూడో స్థానంలో నిలిచిన జగన్ ఇప్పుడు కిందకి తన ర్యాంకు పడిపోవటానికి గల కారణం తెలుసుకుంటారో లేదో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?