హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతితో కలిసి లండన్ బయల్దేరారు. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు బ్రిటన్ ఎయిర్వేస్ విమానంలో జగన్ దంపతులు లండన్ వెళ్లారు. సుమారు వారం రోజులపాటు వారు లండన్లోనే ఉండనున్నారు.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుతున్న కుమార్తె వర్షను చూసేందుకు జగన్ దంపతులు లండన్ వెళ్లారు. తిరిగి ఫిబ్రవరి 26న జగన్ దంపతులు హైదరాబాద్ చేరుకుంటారు. జగన్ గత నెలలోనే లండన్ వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వాయిదా వేసుకున్నట్లు తెలిసింది.
కాగా, అక్రమాస్తుల కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో తన కూతురు లండన్లో చదువుతోందని.. బ్రిటన్ వెళ్లి ఆమెను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జగన్ పెట్టుకున్న పిటిషన్ను కోర్టు పరిశీలించింది. అనంతరం కొన్ని షరతులతో అనుమతిచ్చింది.
ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…
టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…
ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఒక్కోసారి కెరీర్ స్లో అవుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒక బ్లాక్ బస్టర్ హిట్టు వస్తే మళ్లీ వెండి తెరను…
బాలీవుడ్ టాప్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం దర్శకుడిగా కంటే నిర్మాతగా ఎక్కువ బిజీగా ఉన్నాడు. అయితే నెపోటిజాన్ని బాలీవుడ్ అంతటా పెంచేందుకు కరణ్…
ప్రస్తుతం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ రాజమౌళి పేరు మారుమొగుతున్న సంగతి తెలిసిందే. "బాహుబలి 2", "RRR" సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏకంగా ₹1000 కోట్లకు…