తెలుగుదేశం పార్టీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ ప్రబలుతున్నా కూడా 60 ఏళ్లు పైబడిన వ్యక్తిని అర్ధరాత్రి హుటాహుటిన అధికారులు అరెస్టు చేయవలసిన అవసరం ఏముంది అని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
మరొక పక్క దీనిని ప్రభుత్వం యొక్క కుట్రగా కొందరు ఆరోపిస్తున్నారు. నిన్న జగన్ క్యాబినెట్ సమావేశంలో టిడిపి తమ పాలనలో ప్రవేశపెట్టిన స్కీములు మరియు చేపట్టిన అభివృద్ధి పనులను లోతుగా విచారించేందుకు సిబిఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. పక్క రోజే అచ్చెన్నాయుడు అరెస్ట్ కావడం అనేది నిజంగా నాటకీయమైనా కొందరు ఇది యాదృచ్ఛికం అని అంటున్నారు.
అయితే మొదటి నుండి అచ్చెన్నాయుడు పైన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరియు ఏసీబీ అధికారులు ఒక కన్నేసి ఉంచారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం కూడా చాలా ఏళ్ళ నుండి నొక్కి వక్కాణిస్తుంది. తెదేపా అధినేత మాత్రం ఆయన అరెస్టు కాలేదని, కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారాన్ని ఏ కోణంలో అర్ధం చేసుకోవచ్చని మీరు భావిస్తున్నారు. టీడీపీ ఆరోపిస్తున్నట్టు ఇది కక్షసాధింపునా… లేకపోతే ప్రభుత్వం చెప్తున్నట్టు అవినీతిని ఉపేక్షించడం లేదా..?