దేశ స్థాయిలో ఎన్నికల వ్యూహకర్త గా మంచి క్రేజ్ ఉన్న, తన విజయానికి ఎంతో తోడ్పడిన ప్రశాంత్ కిషోర్ ని జగన్ ఇటీవల పిలిపించుకున్నట్లు సమాచారం. దీంతో ఈ విషయం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. గతంలో ఎన్నికల టైంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు, జగన్ ఎత్తుగడలు ప్రత్యర్థి పార్టీ లను చిత్తు చేయడం జరిగింది. కాకా అధికారంలోకి వచ్చి ఏడాది అయిన నేపథ్యంలో అధికారం పరిపాలన అంతా బాగానే ఉన్నా ఇలాంటి టైమ్ లో ప్రశాంత్ కిషోర్ ని జగన్ పిలిపించుకోవడం పార్టీలోనూ మరియు రాజకీయాల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది.
కాగా వినపడుతున్న సమాచారం ప్రకారం అసలు రాష్ట్రంలో కింద స్థాయి ప్రజలలో ప్రభుత్వం పై ఎలాంటి అభిప్రాయం కలిగి ఉంది అనే దాని విషయంలో క్షేత్రస్థాయిలో ఫీడ్ బ్యాక్ విషయంలో జగన్ కు సరైన ఇన్ఫర్మేషన్ రావటం లేదట. చుట్టూ ఉన్న నేతలు మరియు కొంత మంది రాష్ట్రానికి చెందినవారు అమోఘం అద్భుతం అని చెబుతున్న వాటిని జగన్ లెక్కలోకి తీసుకోవటం లేదని సమాచారం.
ఈ సందర్భంగా మరోసారి ప్రశాంత్ కిషోర్ టీం ద్వారా ఏపీ జనాలు ప్రభుత్వం పట్ల కలిగి ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి సర్వేలు చేయించుకోవడానికి జగన్ రెడీ అయినట్లు వార్తలు అందుతున్నాయి. ముఖ్యంగా తన పరిపాలనలో వాలంటీర్ల వ్యవస్థ అదేవిధంగా సచివాలయాల పనితీరు ఎలా ఉంది అన్న దాన్ని మెయిన్ పాయింట్ గా తీసుకొని ప్రశాంత్ కిషోర్ టీం సభ్యుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించడానికి జగన్ రెడీ అయినట్లు సమాచారం. గతంలో ఎన్నికల టైంలో అసలు ప్రజలు పల్స్ ఎప్పటికప్పుడు చెప్పటంలో ప్రశాంతి కిషోర్ టీం సరిగ్గా పని చేయడంతో ఆ నమ్మకంతోనే తన తాజా పరిపాలనపై ప్రజలు ఏ విధమైన అభిప్రాయం కలిగి ఉన్నారు అన్న బాధ్యతలు మళ్లీ పీకే టీంకి అప్పజెప్పినట్లు సమాచారం.