Ys Jagan Mohan Reddy : వైయస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒక నిర్ణయం…గ్రామ సచివాలయ వలంటీర్ల వ్యవస్థను తీసుకురావటం. ప్రభుత్వ పథకాలు అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన పనులు అన్నీ కూడా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఈ వాలంటీర్లు గ్రామ మరియు పట్టణాలలో ఉండే రీతిలో వారికి ఉపాధి కల్పించే విధంగా… జగన్ సర్కార్ అడుగులు వేయటం అందరికీ తెలిసిందే. చాలా వరకూ తన ప్రభుత్వానికి గ్రామ వాలంటీర్ల సచివాలయ వ్యవస్థ యే కీలకమని, చాలా సందర్భాలలో జగన్ తెలపటం అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా కరుణ లాంటి కష్ట సమయంలో గ్రామ వాలంటీర్లు పనితనం మరియు కేసులను గుర్తించటం దేశంలోనే సంచలనం సృష్టించింది. ఇదిలా ఉండగా ఇటీవల కొంతమంది గ్రామ వాలంటీర్లు విజయవాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జీతాలు పెంచాలని భారీ ఎత్తున జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ ఉండటం తో వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరించి మీడియా ఈ ఘటనని జగన్ పాలన కి డ్యామేజ్ అన్న తరహాలో ప్రచారం చేయడం జరిగింది. ఈ క్రమంలో వలంటీర్లకు… జగన్ నేరుగా లెటర్ రాయటమే కాక… ప్రజలు మిమ్మల్ని గొప్పగా చూస్తున్నారు గొప్ప సేవలు అందిస్తున్నారు కాబట్టి ఆప్తులుగా చూస్తున్నారు, మీరు వాలంటీర్లుగా కాకుండా జీతాలు తీసుకుని ఇదే పని చేస్తే ఏ ఒక్కరైనా మీకు ఇటువంటి గౌరవం ఇస్తారా అంటూ జగన్ లేఖలు ఇంకా ప్రస్తావిస్తూ… రాజకీయ నాయకుల ట్రాప్ లో పడకుండా హుందాగా రాణించాలని, ప్రజలకు సేవ చేస్తున్నట్లు భావించి గౌరవంగా రాణించాలని స్పష్టం చేశారు.
Ys Jagan Mohan Reddy :
అంతలా వాలంటీర్ల పట్ల తన ప్రేమను వ్యక్తం చేసిన జగన్ తాజాగా ఇటీవల రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో కళాశాలలో కరోనా వ్యాక్సిన్ వికటించి వాలెంటర్ గా విధులు నిర్వహిస్తున్న లలిత మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరణించిన వాలంటీర్లు లలిత కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దాదాపు 50 లక్షల రూపాయలు విడుదల చేస్తూ… మరణించిన వాలెంటర్ కుటుంబానికి అందేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తాజా సంఘటనతో వాలంటీర్ల పట్ల జగన్ కి ఉన్న అంకితభావం ఏంటో రుజువైందని చాలామంది అంటున్నారు. నిజంగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పట్ల జగన్ కి ఏ మాత్రం చిత్తశుద్ధి లేకపోతే ఈ రీతిగా మరణించిన ఆ వాలంటీర్ కి డబ్బులు వచ్చేది కాదని చెప్పుకొస్తున్నారు.