జగన్ ఏడాది పరిపాలనలో దాదాపు ప్రజలకు ఇచ్చిన హామీ లలో 90% వాగ్దానాలు నెరవేర్చడం జరిగింది. దేశంలో ఇప్పటివరకు అధికారంలోకి వచ్చి ఏ రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ పని చేయలేదు. ముందుగా అనుభవం లేదు అధికారంలోకి వచ్చి నవ్వులపాలు అవుతాడు..అని జగన్ ని మొదట విమర్శించిన వారే ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం ఫాలో అవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతా బాగానే ఉన్నా జగన్ పరిపాలన లో కెరియర్లో ఓ యాంగిల్ లో మాత్రం గట్టిగా దెబ్బతింటున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే మొండితనంగా న్యాయస్థానాలలో వ్యవహరించటం. పరిపాలన పరంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న గాని, న్యాయస్థానాల పరంగా వస్తున్న తీర్పులు ప్రభుత్వాన్ని అబాసు పాలు చేస్తున్నాయని వైయస్ జగన్ కి చెడ్డపేరు తీసుకు వస్తున్నాయి అని అంటున్నారు.
ముఖ్యంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో మొదటిలో అతడు ఏ ఉద్దేశంతో ఎన్నికలను వాయిదా వేశారో అన్న దాని విషయంలో సరైన క్లారిటీ లేకుండా, జగన్ రాజ్యాంగ పదవిలో ఉన్న అతన్ని కొత్త ఆర్డినెన్స్ తీసుకోవచ్చి పదవి నుంచి తప్పించడం జరిగింది. ఇది జగన్ పొలిటికల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మిస్టేక్ అని… హైకోర్టులో కాదు ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా మొట్టికాయలు వేయించుకోవడం వల్ల జగన్ పరిపాలన పై దేశ వ్యాప్తంగా నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు తీర్పును ప్రభుత్వం సవాలు చేయడం పట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ బాబ్డే ఈ వ్యవహారం గురుంచి మాట్లాడుతూ రాజ్యాంగమైన వ్యవస్థలతో ఆడుకోవడం మంచిది కాదంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలని ఆర్డినెన్స్ ను ఎలా ఆమోదిస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్ జారీ చేయడం వెనుక ప్రభుత్వం ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని, ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అలాగే హైకోర్ట్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. దీంతో యధావిధిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ పదవీ బాధ్యతలు చేపట్టడం గ్యారెంటీ అవటంతో ఏపీ ప్రభుత్వం పరువు పోయినట్లే అని కాబట్టి న్యాయస్థానాల విషయంలో వైఎస్ జగన్ మొండి వైఖరి పక్కన పెట్టి నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి అని చాలామంది అంటున్నారు. జగన్ ఏడాది పరిపాలనలో ప్రతిపక్షాలతో మరియు ప్రజలతో ఎక్కడ ఇబ్బంది లేకపోయినా, ఆయన పొలిటికల్ కెరియర్ న్యాయస్థానంలో ఎక్కువ ఎదురుదెబ్బలు తగులుతున్న తరుణంలో ఈ కోణంలో జగన్ సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళితే విపక్షాలకు, న్యాయస్థానాలకు ప్రభుత్వంపై విమర్శలు చేసే ఛాన్స్ ఇచ్చే పరిస్థితి ఉండదని చాలా మంది సూచిస్తున్నారు.