అనేక ఆటుపోట్లు పది సంవత్సరాలు ఎదుర్కొన్న వైఎస్ జగన్ కి అధికారంలోకి వచ్చాక కూడా ఎదురీత తప్పటం లేదు. విపక్షాలు న్యాయస్థానాలు అదేవిధంగా ఇటీవల మెల్లమెల్లగా సొంత పార్టీలో ఉన్న నాయకులు ఒక్కసారిగా దండయాత్ర చేసినట్టుగా జగన్ ను ఇరుకున పెట్టే విధంగా తిరగబడుతూ వ్యవహరించటం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఎంత అధికారంలోకి వచ్చినా జగన్ కి పోరాటం తప్పటంలేదు అన్నట్టుగా పరిస్థితి ఉందని చాలామంది తాజా రాజకీయ పరిణామాలపై కామెంట్ చేస్తున్నారు.
మరోపక్క జగన్ దూకుడు కూడా దీనికి ఒక కారణం అని అంటున్నారు. ముఖ్యంగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మొదటి నుండి పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ పార్టీ ప్రజాప్రతినిధులపై అవినీతి ఆరోపణలు చేయడం తో వైసీపీ పార్టీ పరువు చాలావరకు డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఈ విషయాన్ని ఇక్కడ మీడియాతో పాటు ఢిల్లీ స్థాయిలో కూడా కవరేజ్ వచ్చేలా కేంద్రమంత్రులతో రఘురామకష్ణంరాజు బేటీ అవ్వటం జరిగింది.
దీంతో జగన్ సొంత పార్టీ నేతలపై దూకుడు వ్యవహరిస్తున్నట్లు భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు రఘురామకృష్ణంరాజు పొలిటికల్ ఎపిసోడ్ ద్వారా చిత్రీకరణ అయిందని చాలామంది అంటున్నారు. ఒకపక్క నిమ్మగడ్డ వ్యవహారం మరోపక్క రఘురామకృష్ణంరాజు ఇదే రీతిలో మరికొంతమంది సొంత పార్టీ ప్రజా ప్రతినిధులు జగన్ కి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ దండయాత్రలు చేస్తూ ఎక్కడా కూడా దయ చూపించకుండా అవసరమైతే న్యాయస్థానాలకు వెళ్తూ, జగన్ ని ముప్పుతిప్పలు పెడుతున్నారు అని చాలామంది భావిస్తున్నారు.