సాధారణంగా రాయలసీమ ప్రాంత రాజకీయ నాయకుల పై ఒక నానుడి ఉంటుందంట. అది ఏమిటంటే తమ రాజకీయ జీవితానికి భుజం కాచిన వారిని కచ్చితంగా గుర్తు పెట్టుకొని వారిని సరైన స్థానం లోకి ఆ ప్రాంత రాజకీయ వాసుల అధికారంలోకి వచ్చాక తీసుకెళ్తారట. అదే రీతిలో వెన్నుపోటు పొడిస్తే తమ రాజకీయ జీవితాంతం అతని గుర్తు పెట్టుకొని సరైన రీతిలో బుద్ధి చెబుతారట. విలువైన రాజకీయ నేతలు రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్లు చేసే తీరు రాజనీతి ఇదేనట. ఇప్పుడు ఇదే జగన్ తన మార్కు రాజనీతి అస్త్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాడుతున్నారని పరిశీలకులు అంటున్నారు.
ప్రతిపక్షంలో తాను ఉన్న సమయంలో అమరావతి భూములు పంటలు తగలబెట్టిన సమయములో అధికారం లో ఉన్న టీడీపీ పార్టీకి చెందిన నాయకులు వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్త నందిగామ సురేష్ నీ అక్రమంగా జైల్లో పెట్టి జగన్ మీద నేరం మోపాలని తన తలకాయ పై గన్ పెట్టి కుటుంబాన్ని చంపేస్తామని, వేధించటం జరిగినా కానీ అప్పట్లో వైసీపీ కార్యకర్త గా ఉన్న నందిగామ సురేష్ ఏ మాత్రం తన ప్రాణాలు లెక్క చేయకుండా జగన్ కి అండగా నిలబడటం జరిగింది. పోలీసులు అనేక చిత్ర బాధలకు గురి చేసిన సురేష్ ఏ మాత్రం లొంగలేదు. సీన్ కట్ చేస్తే కొన్నాళ్లకు 2019 ఎన్నికల్లో తనకు అండగా ఉన్నా కార్యకర్త పొజిషన్ లో ఉన్న నందిగామ సురేష్ ని బాపట్ల ఎంపీ గా తన పార్టీ తరుపున పోటీకి నిలబెట్టి గెలిపించుకునీ జగన్…పార్లమెంట్ లో కూర్చోబెట్టడం జరిగింది.
అదేరీతిలో తన పది సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్ రాజకీయ జీవితంలో తనని రాజకీయంగా, కుటుంబ పరంగా వేధించిన రాజకీయ నేతలను ప్రస్తుతం వైయస్ జగన్ ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తూ.. స్క్రిప్ట్ రెడీ చేసుకోవటం జరిగినట్లు… పరిశీలకులు భావిస్తున్నారు. రాజకీయంగా ప్రతిపక్షంగా తన పాత్ర పోషిస్తున్న టైములో అచ్చెన్నాయుడు, అదే విధంగా కొంతమంది టీడీపీ నేతలు తనని అన్న మాటలను వైయస్ జగన్ బాగా గుర్తు పెట్టుకోవటం జరిగిందని, అందువల్లనే వారిని రాజకీయంగా కోలుకోలేని దెబ్బ కొట్టడానికి గత ప్రభుత్వం పై సిబిఐ విచారణ జగన్ వేయటం జరిగిందని భావిస్తున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో భవిష్యత్తు లేకుండా చేయాలనీ జగన్ గ్రౌండ్ ప్రిపేర్ చేశారని ఏపీ రాజకీయాల్లో టాక్.