Ys Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు చాలావరకూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాల పై భారం తగ్గే రీతిలో ఉన్నాయని చెప్పవచ్చు. అమ్మ ఒడి గాని ఇంకా అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకం.. వైఎస్ఆర్ ఆసరా, జగనన్న విద్య దీవెన, జగనన్న గోరుముద్ద ఈ పథకాలు చాలావరకూ పేద మధ్యతరగతి ప్రజలపై ఎటువంటి భారం లేకుండా..
ప్రభుత్వమే భరించే రీతిలో జగన్ ఆలోచనల నుంచి పుట్టుకు రావడం జరిగింది. ముఖ్యంగా విద్య వైద్య విషయాలలో ఎలాంటి భారం కూడా సామాన్యులపై పడకుండా తనదైన శైలిలో జగన్ పరిపాలన అందిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా మధ్యతరగతి అదేవిధంగా రైతులకు మేలు చేకూరే రీతిలో జనతా బజార్లు తీసుకురావటానికి..
Ys Jagan Mohan Reddy : జగన్ సర్దార్ డిసైడ్
జగన్ సర్దార్ డిసైడ్ అయినట్లు సమాచారం. వీటి వల్ల బయట మార్కెట్లో కన్నా తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు సామాన్యులకు అందించడానికి జగన్ ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అంతమాత్రమే కాకుండా రైతులకు కనీస మద్దతు ధర మరోవైపు వినియోగదారులకు తక్కువ ధర అందించడమే లక్ష్యంగా ఐదు వేల జనాభా ఉన్న చోట ఐదువందల చదరపు అడుగుల విస్తీర్ణంలో జనతా బజార్లు ఏర్పాటు చేయటానికి జగన్ సర్కార్ సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
50 వేల నుంచి రెండు లక్షల జనాభా ఉన్న చోట 5 వేల నుంచి 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మరిన్ని జనతా బజార్ లు ఏర్పాటు చేయాలని ఇటీవల ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశంలో సీఎం జగన్ డిసైడ్ అయినట్లు టాక్. వీటివల్ల ఒకపక్క రైతులకు మరోపక్క వినియోగదారులకు మేలు చేకూర్చే కార్యక్రమం అవుతుందని జగన్ ప్రగాఢంగా నమ్ముతున్నారట.