Ys Jagan Mohan Reddy : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి కి తగ్గ తనయుడిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నరు వైయస్ జగన్మోహన్ రెడ్డి. Ys Jagan Mohan Reddy ఇదిలా ఉంటే రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే మరొకసారి కొత్త నిర్ణయంతో జనాల్లోకి వెళ్ళటానికి జగన్ తాజాగా డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
మేటర్ లోకి వెళ్తే ఉగాది తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు ఉంటే వెంటనే వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించే దిశగా జగన్ రచ్చబండ కార్యక్రమాన్ని రూపొందించబోతున్న ట్లు టాక్.
ఈ నేపథ్యంలో రేషన్ కార్డులు ఇంకా మరి ఎలాంటి సమస్యలు ప్రజల నుంచి తనకి ఫిర్యాదులు రూపంలో రాకుండా లోపు పరిష్కరించాలని తాజాగా అధికారులకు జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే రచ్చబండ కార్యక్రమాన్ని గత ఏడాదే ప్రారంభించాలని జగన్ నిర్ణయించుకున్నారు. కానీ మహమ్మారి కరోనా వైరస్ రావడంతో… పరిస్థితులన్నీ మారిపోవడంతో.. ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తుంది. సంక్రాంతి పండుగ సమయంలో చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించాలని ప్లాన్ చేయగా ఇప్పుడు.. ఉగాది తర్వాత తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రారంభించాలని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పాదయాత్ర అదేవిధంగా ఎన్నికల ప్రచారం తర్వాత జగన్… జనాల్లోకి వస్తున్న నేపథ్యంలో స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఏప్రిల్ మధ్యలో నుండి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా కలెక్టర్ ఇతర ప్రభుత్వ అధికారులు తన వెంట నడిచే రీతిలో ఎక్కడికక్కడ సమస్య పరిష్కరించే దిశగా… జగన్ ఈ రచ్చబండ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.