Ys Jagan Mohan Reddy : వైయస్ జగన్ మోహన్ రెడ్డి Ys Jagan Mohan Reddy అధికారంలోకి వచ్చాక చాలా వరకు రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించే రీతిలో నిర్ణయాలు తీసుకుంటూ, మరోపక్క పాలనకు ఉపయోగపడేలా పరిపాలన అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధంగానే ఒకపక్క ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలలోకి వెళ్లే విధంగా గ్రామ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ ను తీసుకొచ్చి దాదాపు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం దేశంలోనే సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే మాదిరి తరహాలో గ్రామాల్లో పెద్ద పెద్ద చదువులు చదివిన విద్యార్థులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారికి ఉపాధి కలిగించే రీతిలో జగన్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తాజాగా తీసుకున్నట్లు టాక్. విషయంలోకి వెళితే ప్రపంచంలో “వర్క్ ఫ్రొం హోమ్” దిశగా చాలా ఉద్యోగాలు వస్తున్న తరుణంలో…రాబోయే మూడు సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో ఇంటర్నెట్ కల్పించడానికి జగన్ సర్కార్ పునుకున్న సంగతి ఆల్రెడీ మనకు తెలిసిందే. ఈ విధానం ద్వారా ఇంటిలోనే గ్రామాల్లో ఉండే యువకులకు ఉద్యోగాలు కల్పించే దిశగా జగన్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు సరికొత్త వార్త ఒకటి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తుంది.
ఈ విధానం ద్వారానే త్వరలో కొన్ని కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని… ఇంటిలోనే గ్రామాలలో ఉండే యువకులకు అనగా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించే విధంగా … ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే గ్రామాల్లో రాబోయే మూడు సంవత్సరాలలో ఇంటర్నెట్ ఎలాగైనా తీసుకు వచ్చే ఆలోచన జగన్ ప్రభుత్వం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేయడానికి జగన్ ప్రభుత్వం సన్నాహాలు చేయబోతోందట. దీంతో ఇప్పటి వరకు పెద్ద పెద్ద కంపెనీల లో అది కూడా మెట్రోపాలిటన్ సిటీ లో పని చేసుకుంటూ భారీ జీతాలు పొందుతున్న ఆ పరిస్థితులకు అనుగుణంగా ఇంటి దగ్గర నుండి పెద్ద పెద్ద కంపెనీల ఉద్యోగాలు అందుకునే విధంగా జగన్ ప్రభుత్వం ఆలోచన చేయడం న్యూస్ ఇప్పుడు జాతీయ మీడియాలో అదే విధంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజా వార్త పై దేశం మొత్తం షాక్ అయ్యే రీతిలో ఏపీ లో జగన్ పాలన ఉన్నట్లు కామెంట్లు నెటిజన్ల నుండి వస్తున్నాయి.