Ys Jagan Mohan Reddy : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా ఖజానా కి మంచి రాబడి రావటం ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండటం అందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడైతే విభజన జరిగిందో మిగిలిన 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం హైదరాబాద్ కోల్పోవడంతో ఆర్థికంగా చాలా నష్టపోయింది. ఇటువంటి నేపథ్యంలో ఏపీ చాలావరకు వ్యవసాయాధారిత రాష్ట్రం అయింది. ఇలాంటి తరుణంలో జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు పూర్తయితే చాలా వరకు ఏపీ ఖజానా కి మంచి రాబడి వచ్చే అవకాశం ఉన్న తరుణంలో.. ఈ విషయంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి వైయస్ జగన్ Ys Jagan Mohan Reddy కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు అడ్డంపెట్టుకుని భారీ అవినీతికి పాల్పడ్డారని ఏకంగా దేశ ప్రధాని మోడీ పలు సందర్భాలలో వ్యాఖ్యానించటం జరగగా.. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మాత్రం పోలవరం విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తూ ఎక్కడా ప్రజాధనం వృధా కాకుండా నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి. ముఖ్యమంత్రి పీఠం లో కూర్చోగానే జగన్ పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ వేసి మెగా ఇంజనీరింగ్ వారికి అప్పగించడం తెలిసిందే.
ఇదే తరుణంలో జగన్ నెలలో ఒక్కరోజైనా పోలవరం ప్రాజెక్ట్ సందర్శించే విధంగా పాలన షెడ్యూల్ వేసుకుని మరి ఎప్పటికప్పుడు పనులను సమీక్షిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రపంచ రికార్డు సీఎం జగన్ సృష్టించడం జరిగింది. మేటర్ ఏమిటంటే ప్రపంచంలో ఏ భారీ ప్రాజెక్టుకు లేని గేట్లు ఈ పోలవరం ప్రాజెక్టుకు ఉండేవిధంగా జర్మనీ దేశం నుండి హైడ్రాలిక్ హైయెస్ట్ సిలిండర్లు కలిగిన అతిపెద్ద గేట్లను అమర్చడానికి రెడీ అయ్యారు. దీంతో ఈ వార్త దేశవ్యాప్తంగా మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టులలో పోలవరం ప్రాజెక్టు ఒకటి అని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో వచ్చే 2022 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేయాలని సంకల్పంతో జగన్ సర్కార్ వేస్తున్న అడుగులకు తీసుకున్న నిర్ణయాలకు తాజాగా హైడ్రాలిక్ హైయెస్ట్ సిలిండర్లు గేట్లు జగన్ సర్కార్ తీసుకురావడం పట్ల పోలవరం ప్రాజెక్టు విషయంలో విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగే విధంగా అతి పెద్ద భారీ గెలుపు వారి విమర్శలపై గెలిచినట్లు అయింది. ఈ స్థాయిలో గత పాలకులు కూడా ఆలోచించని విధంగా జగన్.. అదిరిపోయే టెక్నాలజీతో పోలవరం గేట్లు పెడుతున్న తరుణంలో..ప్రతిపక్షాలు జగన్ పనితనాన్ని విమర్శించ లేని విధంగా డిఫెన్స్ లో పడిపోయారు.