బోల్డ్ అండ్ స్పీడ్ నిర్ణయాలు తీసుకోవడంలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎవరూ సాటి రారు అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
అలాంటి నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆయన మొహమాటాలు కూడా పెట్టుకోరు.అదే తీరులో ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి. ఎన్నికలకు ముందు ఎంతోమందికి జగన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు.ఈ జాబితా చాంతాడంత ఉంది. తాజాగా కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసే అవకాశం వచ్చింది. వాటిలో రెండింటిని ఇటీవలే భర్తీ చేశారు. ఇంకా ఖాళీగా ఉన్న ఒక స్థానంలో అనూహ్యంగా మొన్న మరణించిన పెన్మత్స సాంబశివరాజు కుమారుడు సురేష్కు ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేశారు. సాంబశివరాజు మరణించిన పక్క రోజే జగన్ ఏ నిర్ణయం తీసుకోవటం ఇక్కడ గమనార్హం.
ఇది పార్టీ వర్గాలను విస్మయపరిచింది.నిజానికి పెన్మత్స సాంబశివరాజు బొత్స గురువు. కానీ తర్వాత తన గురువుకే బొత్స ఎసరు పెట్టారు. ఆ తర్వాత బొత్సకంటే ముందే వైసీపీలో చేరారు. అక్కడా ఆయనకు టిక్కెట్ రాకుండా బొత్స చేశారు. 2019 ఎన్నికల్లో నెలిమర్ల టిక్కెట్ను పెనుమత్స సాంబశివరాజు కుమారుడు సురేష్కి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. తర్వాత బొత్స రాజకీయంతో ఆయన స్థానంలో బొత్స సోదరుడు అప్పలనాయుడికి టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత వారు పూర్తిగా రాజకీయంగా కనుమరుగయారు.ఆయితే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి సురేష్ పోటీ చేసి ఓడిపోయారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ రాకపోయినప్పటికీ బొత్స సోదరుడు గెలుపునకు కృషి చేశారు. ఇవన్నీ గుర్తుంచుకున్న జగన్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని సురేష్ కిఎమ్మెల్సీ పదవి ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సురేష్ కి ఈ పదవి ఇవ్వటం మంత్రి బొత్స కి ఇష్టం లేకపోవచ్చు. కానీ అలాంటి వాటిని వేటినీ జగన్ పరిగణనలోకి తీసుకోకుండా తన మనస్సాక్షి ప్రకారం నడుచుకొని తనను నమ్ముకున్న వారికి తప్పక న్యాయం చేస్తాడని రుజువు చేసుకున్నారు. దటీజ్ జగన్ అని వైసిపి వర్గాలు అంటున్నాయి.