అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి నాడు నాణ్యమైన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. ఇది చిన్న విషయం కాదు. సంక్షేమమే తన మొదటి ప్రాధాన్యం అని ముందుకు వెళ్తున్న జగన్.. ఈ విష్యంలో వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా వినియోగించుకోవడంలో సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి. ఈ క్రమంలో ఇప్పుడు జగన్ సర్కారు మరో అడుగు ముందుకు వేస్తోంది.
జనం వద్దకే సకల సౌకర్యాలు అందాలనే కాన్సెప్టులో భాగంగా.. పించన్లును ఇప్పటికే ఇళ్ల వద్ద అందిస్తున్న జగన్ సర్కార్… తాజాగా నాణ్యమైన నిత్యావసర సరుకులను పేదల ఇంటికే చేర్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా… ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించాలని తలపెట్టింది. అందుకే ప్రజా పంపిణీ వ్యవస్థను నేరుగా ఇంటి ముందుకే తీసుకొస్తున్నారు. ఆ దిశగా అందుకు అవసరమైన ఏర్పాట్లును ప్రభుత్వం సిద్ధం చేసింది.
నిత్యావసర సరుకుల పంపిణీకి సంబందించిన మొబైల్ వాహనాలను ప్రభుత్వం తయారు చేయించింది. రాష్ట్రవ్యాప్తంగా 13 వేల ట్రాలీలు ఇందుకోసం అవసరమవుతాయి. ఆ నమూనాలను మంత్రులు కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, శ్రీరంగనాథరాజు పరిశీలించారు. ఈ వాహనాల ద్వారా నేరుగా ప్రజల ఇంటి ముందుకే వెళ్లి తూకం వేసి చూపించి మరీ సరుకులు అందజేస్తారు. ఈ తాజా నిర్ణయంతో జగన్ పై అభినందనలు వెళ్లివెత్తుతున్నాయి. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ముఖ్యంగా గ్రామ ప్రజలకు అతంత చేరువవుతున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ ఆలోచన చేసిన జగన్ ను ప్రజలంతా అభినందిస్తున్నారు.