అవును…వైసిపి అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కోపం వచ్చింది. రాజమండ్రిలో పార్టీ గ్రూపు తగాదాలతో కునారిల్లడం జూసి సీఎం సీరియస్ అయ్యారు.
మీ గ్రూప్ లఆధిపత్య పోరుతో పార్టీ పరువు చంక నాకి పోతుంది. అసలే రాజమండ్రి అర్బన్, రూరల్ పూర్తిగా వైసిపి బలహీనంగా ఉంది. ఇక్కడ బలపడాలిసింది పోయి ప్రత్యర్థులకు అదనపు అడ్వాంటేజ్ ఇస్తున్నారు. మీ తగాదాలతో కార్యకర్తలు నలిగిపోతున్నారు. నామినేటెడ్ పదవులు సైతం భర్తీ చేయలేకపోతున్నాం. ఇక ఆపండి లేదా మిమ్మల్ని పక్కన పెట్టేస్తాను ఆని జగను సీరియస్ వార్నింగ్ వచ్చే వరకూ పరిస్థితి వెళ్లింది .దాంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లే కనిపించింది.రాజమండ్రిలో పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ రామ్, రాజానగరం ఎమ్యెల్యే జక్కంపూడి రాజా లకు చెందిన రెండు ప్రధాన గ్రూప్ లు కలిశాయి. ఒక హోటల్ ను వేదికగా చేసి అక్కడ మీడియా సమావేశం పెట్టి తమ మధ్యన ఏర్పడ్డ ఆవభూముల వ్యవహార వివాదానికి మంగళం పాడేశారు. వీరందరిని ఒక చోటకు పార్లమెంట్ కో ఆర్డినేటర్ మోసేన్ రాజు, వైసిపి సిటీ ఇన్ ఛార్జ్ శివరామ సుబ్రహ్మణ్యం చేర్చారు.
ఇంతవరకూ బాగానే ఉంది అయితే వారు అధినేత ఆగ్రహానికి జడిసి మీడియా సమావేశంలో కలిసిపోయినట్టు ఉత్తుత్తి బిల్డప్ ఇచ్చారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.వీరి నడుమ సఖ్యత కష్టమే అని అధిష్టానం కోసం కష్టపడే కలిసారని ఇష్టపడి మాత్రం కాదంటున్నారు.రాజమండ్రి పంచాయితీ అంత సులువుగా తెగేది కాదని పరిశీలకులు కూడా చెబుతున్నారు మరి జగన్ ఏం చేస్తారో చూడాలి .