ఇచ్చాపురం(శ్రీకాకుళం), జనవరి 9: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర బుధవారం నాలుగు గంటలకు ముగిసింది. పాదయాత్రకు ఛిహ్నంగా రూపొందించిన పైలాన్ను జగన్ ఆవిష్కరించారు.
అనంతరం ఇఛ్చాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్ధేశించి ఆయన మాట్లాడుతున్నారు. ఈ సభకు అధికసంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
2017 నవంబరు ఆరున వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం నుండి వైసిపి అధినేత చేపట్టిన పాదయాత్ర 341 రోజుల తర్వాత ఇచ్ఛాపురంలో ముగిసింది.
రాష్ర్టంలోని 134 నియోజకవర్గాలలో సుమారు 3,648 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టి, 124 బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
సభ అనంతరం విజయనగరం చేరుకుని రైల్లో తిరుపతి వెళతారు. గురువారం అలిపిరి నుండి కాలినడకన తిరుమల చేరుకుంటారు. వేంకటేశుని దర్శనం అనంతరం రాత్రి తిరుమలలో బసచేస్తారు. 11న తిరుమల నుంచి కడప చేరుకుని పెద దర్గాను దర్శిస్తారు. అక్కడనుంచి పులివెందులలో చర్చికి వెళ్ళి ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. తర్వాత ఇడుపులపాయ చేరుకుని వైఎస్ సమాధి వద్ద నివాళుల అర్పిస్తారు
previous post
next post