అమరావతి: ప్రజావేదిక విషయంపై సిఎం జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని పలువురు టిడిపి నేతలు తప్పుబట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావేదికను కడితే దానిని కూల్చివేస్తామనడం సరికాదని అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రజలు హర్షించరని ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న,మాజీ మంత్రి కొల్లు రవీంద్రలు అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు అడినందుకే కూల్చివేత నిర్ణయం తీసుకున్నారని వారు ఆరోపించారు. ఇది కక్షసాధింపు చర్యేనని సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్నలు అన్నారు. అక్రమ కట్టడం అంటున్న వారు కలెక్టర్ల సమావేశం ఎందుకు పెట్టారని పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు.
previous post
next post