అంతర్వేది దురదృష్టకర సంఘటనపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే అంతర్వేదిలో పరిస్థితులు చక్కబడడానికి స్పెషల్ ఆఫీసర్ ను నియమించిన సంగతి తెల్సిందే. స్పెషల్ ఆఫీసర్గా దేవదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్ ని ఏపీ ప్రభుత్వం నియమించింది.
అంతర్వేదిలోకి ఎవరినీ రానివ్వకుండా చర్యలు తీసుకుంది. రామచంద్రమోహన్ ను 15 రోజులు అంతర్వేదిలోనే ఉండి పరిస్థితులను చక్కబెట్టాలని కోరింది. మరోవైపు ఈ ఘటనపై సీబీఐ విచారణ చేప్పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖకు డిజిపి కార్యాలయం లేఖ పంపింది. అలాగే రేపు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్ లో అంతర్వేది రథం దగ్ధం తీవ్ర కలకలం రేపిన విషయం తెల్సిందే.