JAGAN: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నవ రత్నాలు పేరిట అనేక సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ పధకాల వలన ఎంతోమంది ప్రజలు లబ్ది పొందారు.నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ళు అనే లక్ష్యంతో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటినికట్టి ఇవ్వాలనే దిశగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోక శుభవార్త అందించారు. అది ఏంటంటే జగనన్న కాలనీలలో ఇళ్లను నిర్మించుకునే పేదలకు పావలా వడ్డీపై రుణాలు మంజూరు చేసేలా సీఎం నిర్ణయం తీసకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అన్ని బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించారు.అవసరం అయినప్పుడు ఆ ఇంటి పట్టాలపై రుణం తీసుకునె అవకాశం కల్పించామని తెలిపారు.
BREAKING : డ్రగ్స్ కేసులో ఈడి దృష్టి… వెలుగులోకి కీలక ఆధారాలు..?
ఇలా తీసుకున్న రుణాలపై కేవలం లబ్దిదారుడికి పావలా వడ్డి మాత్రమే పడుతుందని ముఖ్యమత్రి అన్నారు. మిగతా వడ్డీ అంతా ప్రభుత్వమే కడుతుందని చెప్పారు.ఇలా రుణాలు ఇవ్వడం వలన ఇళ్ల నిర్మాణ కార్యక్రమం వేగవంతం అవుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.కొన్ని జిల్లాల్లోఅభిప్రాయపడ్డారు. అలాగే సెర్ప్, మెప్మా సహకారంతో లబ్ధిదారులకు ఇప్పటికే పావలా వడ్డీ కింద రుణాలు ఇస్తున్నారని గుర్తుచేశారు.బుధవారం జరిగిన సీఎం మీటింగ్ లో ఇళ్ల నిర్మాణంపై పది రోజుల్లో ప్లాట్ల మ్యాపింగ్ జరిగిపోవాలని చెప్పారు.
కొత్తగా ఇంకెవరయినా ఇంటికి దరఖాస్తు చేసుకుంటే వాటిని స్వీకరించి అర్హులైన వారికి ఇంటిపట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి అన్నారు.అలాగే మొదటి దశలో భాగంగా 15.60 లక్షల ఇళ్లు నిర్మించనున్నారట. కాగా ఇప్పటివరకు 10.11 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయి. . కొన్ని జిల్లాల్లో ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాగ్రి ధరలను అనూహ్యంగా పెంచారన్న సమాచారం వస్తోంది.దీనిపై కలెక్టర్లు విచారణ జరిపి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వ్యవసాయం గురించి స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాల గురించి కూడా సమీక్ష నిర్వహించారు. !
BREAKING : డ్రగ్స్ కేసులో ఈడి దృష్టి… వెలుగులోకి కీలక ఆధారాలు..?