YS Jagan: ఇటీవల ప్రధాని మోడీ ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును అదేరీతిలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతమాత్రమే కాకుండా కరోనా నిబంధనలు ఏ విధంగా రాష్ట్రంలో అమలు చేస్తున్నారు అనేదాని గురించి కూడా ముఖ్యమంత్రుల వద్ద నుండి సమాచారం మోడీ తెలుసుకోవటం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కి షాకిచ్చే రీతిలో మోడీ కి ఓ విజ్ఞప్తి చేయడం జరిగింది. విషయంలోకి వెళితే కరోనా కట్టడి విషయంలో కేవలం వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం మాత్రమే పరిష్కారమని గతంలో మోడీ అనేకమార్లు తెలపటంతో అదే విషయాన్ని ఈ సమావేశంలో జగన్ లేవనెత్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేట్ హాస్పిటల్స్ కి కేటాయిస్తున్న కరోనా టీకా లు… ప్రజలకు వేయటంలో అశ్రద్ధ వహిస్తున్నారని ప్రధాని మోడీ దృష్టికి తీసుకువచ్చారు.
Read More: YS Jagan: నెక్స్ట్ కూడా మళ్లీ వైయస్ జగన్నే ముఖ్యమంత్రి అంటూ టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్..!!
ఇటీవలే ప్రైవేట్ హాస్పిటల్ కి 17 లక్షల వ్యాక్సిన్ డోస్ లు అందజేస్తే… కేవలం నాలుగు లక్షలు మాత్రమే వినియోగించారని.. వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు అంతగా శ్రద్ధ తీసుకోవటం లేదని, అవే డోస్ లు రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తే కచ్చితంగా సులభతరంగా ప్రజలకు వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం మరింత శరవేగంగా వేస్తామని ప్రధాని మోడీ కి తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రి లు పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ పంపిణీ చేయలేని నేపథ్యంలో ఆ కోటా నీ రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని ఈ సమావేశంలో మోడీకి జగన్ విజ్ఞప్తి చేశారు.