Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా హైలైట్ అవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాలలో అమలు చేయాలని భావిస్తున్నాయి. ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ విధానం అదే విధంగా స్పందన కార్యక్రమం వంటివి ఇప్పటికే అమలు చేయడానికి కర్ణాటక, ఢిల్లీ, బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో మనుషుల విషయంలో మాత్రమే కాక రాష్ట్రంలో పశువుల విషయంలో కూడా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
మేటర్ లోకి వెళ్తే రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో పశువులకు సంబంధించి ప్రత్యేకమైన ఆంబులెన్స్ ఏర్పాటు చేయాలని అది కూడా 108 తరహాలోనే పనిచేసే విధంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొబైల్ క్లినిక్ తరహాలో ఈ ఆంబులెన్స్ ద్వారా స్పాట్లోనే పశువులకు మేలు చేసే రకంగా… వెటర్నరీ సిబ్బందిని నియమించడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. పశువులకు సంబంధించి ఈ ప్రత్యేకమైన ఆంబులెన్స్ ద్వారా అన్ని రకాలుగా.. చికిత్సలు అందించడం కోసం … రాష్ట్ర వ్యాప్తంగా ఈ వెటర్నరీ క్లినిక్ లు అన్ని నియోజకవర్గాలలో ఏర్పాటు చేయబోతున్నారు జగన్.
ఇప్పటికే ఈ విషయం గురించి అధికారులతో చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వెటర్నరీ పోస్టులు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో భర్తీ చేయడానికి జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పశువుల విషయంలో ఈ విధమైన జాగ్రత్త తీసుకొని రీతిలో ఏపీ సీఎం జగన్ తీసుకోవటంతో..ఈ వార్త సోషల్ మీడియాలో అదే విధంగా జాతీయ స్థాయిలో వైరల్ అవుతుంది.