విభజనతో నష్టపోయి ఆంధ్ర ప్రదేశ్ ఖజానా కి రాబడి లేకపోయినా కానీ లిక్కర్ విషయంలో మాత్రం ప్రజలకు ఇచ్చిన మాటను తప్పటంలేదు జగన్ సర్కార్. అధికారంలోకి రావటమే ఖాళీ ఖజానా దర్శనమిచ్చి రాష్ట్ర ఖజానాపై ఫుల్ అప్పులు ఉన్నాగాని మద్య నియంత్రణ విషయంలో అన్ని చర్యలు తీసుకుంటున్నారు వైయస్ జగన్. ముందుగా గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చేసి ఆ తర్వాత మద్యం పాలసీ ఫుల్లుగా ప్రభుత్వం చేతిలో నడిపే విధంగా రూల్స్ మార్చి మందు బాబులకు షాక్ కొట్టే విధంగా మద్యం రేట్లు పెంచి మద్య నియంత్రణ చేపట్టడానికి అన్నిరకాల చర్యలు చేపడుతున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఇటీవల అధికారులతో రాష్ట్రంలో జరుగుతున్న పాలన గురించి సమావేశమైన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మద్యం ఏ విధంగా అరికట్ట గలిగాము అన్నదానిపై అధికారులతో చర్చిస్తూ…. రేట్లు పెంచి మందుబాబులకు షాక్ కొట్టే విధంగా చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందని జగన్ తెలిపారు. ఈ పరిణామంతో చాలా వరకు మందుబాబులు ఆలోచనలో మార్పు వచ్చినట్లు జగన్ కూడా హ్యాపీగా ఫీల్ అయినట్లు సమాచారం.
రాష్ట్రంలో మందు బాబు ల వల్ల ఏ కుటుంబం ఏ ఆడపడుచు కన్నీరు పెట్టకూడదని ఎన్నికల ప్రచారంలో పాదయాత్రలో జగన్ మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చిన వెంటనే మద్య నియంత్రణ దశలవారీగా చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది . ఆ విధంగానే జగన్ ఇప్పుడు చర్యలు తీసుకోవడంతో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడపడుచులు తమ భర్తలు తాగుడు నుండి విముక్తి పొందడానికి జగన్ తీసుకున్న నిర్ణయాలు చాలా బాగా పనిచేస్తున్నాయని అంటున్నారు. ఒకప్పుడు భర్త వస్తే భయమేసేది అని, కానీ ఇప్పుడు కుటుంబం అంతా సంతోషంగా ఉంటున్నామని మరి కొంతమంది ఆడపడుచులు అంటున్నారు. అంతేకాకుండా జగన్ నిర్ణయాలు మరిన్ని కుటుంబాలను నిలబెట్టాలని కోరుకుంటున్నారు.